కంచె సినిమాతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకున్న అందాల ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్. ఇందులో చాలా పద్దతిగా కనిపించి అశేష ప్రేక్షకాదరణ పొందింది. ప్రగ్యా జైస్వాల్ని చూసి అందరు అప్పట్లో తెగ డిస్కషన్ కూడా పెట్టుకున్నారు. మంచి హీరోయిన్ కూడా అవుతుందని అనుకున్నారు.
అయితే కంచె తర్వాత ప్రగ్యా పలు సినిమాలు చేసిన కూడా ఒక్కటి సక్సెస్ కాలేదు. అందాలు కావాల్సినంత ఆరబోసినా కూడా ఎందుకో కానీ ఈ భామకు అదృష్టం కలిసి రాక హిట్స్ పడడం లేదు. ఇటీవల బాలయ్యతో చేసిన అఖండ మాత్రం బంపర్ హిట్ అందుకుంది. కాకపోతే ఆ విజయం మొత్తం బాలయ్య ఖాతాలోకే పోవడంతో ప్రగ్యా జైస్వాల్కి నిరాశే ఎదురైంది.
ప్రగ్యా జైస్వాల్కి సినిమాల్లో సరైన ఛాన్సులు రాకపోయినా.. పెయిడ్ యాడ్స్తో మంచిగా సంపాదిస్తుంది. ఇటీవల ఒక యాడ్ కోసం గడ్డ కట్టే చలిలో ఈత కొట్టింది. అందుకు సంబంధించిన విజువల్స్ నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి.1991 జనవరి 12న జన్మించిన ప్రగ్యా జైస్వాల్ ముందుగా కొన్ని యాడ్ ఫిల్మ్స్లో నటించింది.
ఆ తర్వాత 2014లో తెలుగు, తమిళ్ బై లింగ్వల్ ‘విరాట్టు డేగ’ సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చింది. ఇక తెలుగులో 2015లో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ‘కంచె’ సినిమాతో టాలీవుడ్కి పరిచయం కాగా, తొలి సినిమాతోనే బెస్ట్ ఫీమేల్ డెబ్యూ అవార్డు కైవసం చేసుకొని అందరి దృష్టిని ఆకర్షించింది. స్టార్ హీరోలతో జత కట్టిన ప్రగ్యాకి పెద్దగా పేరు రావడం లేదు.
ఇక ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో అందాల దుమారం రేపుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు కేక పెట్టించే అందాలతో కుర్రాళ్లని బౌల్డ్ చేస్తుంటుంది. ఎద అందాలు, థైస్ అందాలు చూపిస్తూ నానా హంగామా సృష్టిస్తుంది. తాజాగా ఈ బోల్డ్ బ్యూటీ థండర్ థైస్తో కట్టిపడేసింది. టాప్ నుండి బాటమ్ వరకు ఈ అందాల ముద్దుగుమ్మ విధ్వంసం సృష్టిస్తూ కుర్రాళ్లకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది.ప్రస్తుతం ప్రగ్యా జైస్వాల్ పిక్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.