Revanth Reddy | 21వేల పోస్టులకు 5వేలతో డిఎస్సీతో మరో మోసం సీఎం కేసీఆర్పై రేవంత్రెడ్డి ధ్వజం కర్ణాటక మాదిరిగా తెలంగాణలోనూ హామీలన్ని అమలు విధాత : సీఎం కేసీఆర్ ప్రభుత్వం 5వేల పోస్టులతో డీఎస్సీ ప్రకటించడం ఎన్నికల దగా డీఎస్సీగా పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ట్వీట్టర్ ద్వారా, మీడియా సమావేశంలో తప్పుబట్టారు. విద్యాశాఖ గణాంకాల ప్రకారం 21 వేల పోస్టులు ఖాళీగా ఉంటే, సీఎం కేసీఆర్ మాటల మేరకు కూడా 13 వేల పోస్టుల ఖాళీగా […]
Revanth Reddy |
విధాత : సీఎం కేసీఆర్ ప్రభుత్వం 5వేల పోస్టులతో డీఎస్సీ ప్రకటించడం ఎన్నికల దగా డీఎస్సీగా పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ట్వీట్టర్ ద్వారా, మీడియా సమావేశంలో తప్పుబట్టారు. విద్యాశాఖ గణాంకాల ప్రకారం 21 వేల పోస్టులు ఖాళీగా ఉంటే, సీఎం కేసీఆర్ మాటల మేరకు కూడా 13 వేల పోస్టుల ఖాళీగా ఉన్నాయన్నారు.
ప్రభుత్వం మాత్రం 5వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి నిరుద్యగులను దగా చేసిందన్నారు. కేంద్రం గ్యాస్ సిలిండర్ ధర తగ్గించడంపై కూడా రేవంత్ రెడ్డి సెటర్ వేస్తూ ఒక గజదొంగ దారి దోపిడీ చేసి సర్వం దోచుకున్న తర్వాత దారి ఖర్చుల కోసం రూ.200 ఉంచోకోమని ఇచ్చిననట్లుగా కేంద్ర ప్రభుత్వం వైఖరి ఉందని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ హయాంలో గ్యాస్ బండ ధర రూ.410 ఉంటే దానిని మోడీ అధికారంలోకి వచ్చాక రూ. 1200 చేశారని దుయ్యబట్టారు. ఇన్నాళ్లు పేద మధ్యతరగతి ప్రజలను ఇబ్బందుల పాలు చేసి తీరా ఇప్పుడు గ్యాస్ ధర తగ్గించడాన్ని ఇలా కాకుండా మరెలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రధాన హామీల్లో ఒకటైన పేద మహిళకు నెలకు 2వేల సహాయం అందించే గృహ లక్ష్మి పథకాన్ని మైసూరులో రాహుల్ గాంధీ సమక్షంలో బుధవారం ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడంపై రేవంత్ స్పందిస్తూ చేతి గుర్తు మా చిహ్నం..చేసి చూపించడమే మా నైజం అన్నారు.