Site icon vidhaatha

బైక్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ఒకరు మృతి

విధాత: యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్ సమీపంలో ఆర్టీసీ బస్సు బైక్ ను ఢీకొట్టడంతో ఒకరు దుర్మరణం చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.

బైక్ పై వెళ్తున్న వ్యక్తులు మాదాపూర్ గ్రామానికి చెందిన వారుగా స్థానికులు గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version