Stone of Destiny
విధాత: కింగ్ చార్లెస్కు జరుగుతున్న పట్టాభిషేకంలో ప్రతీ వస్తువు వెనక ఒక ఘనమైన చరిత్ర ఉంది. ముఖ్యంగా అతి పవిత్రంగా భావించే ‘స్టోన్ అఫ్ డెస్టినీ’ రాయి అలాంటి వస్తువుల్లో ఒకటి. ఈ పురాతన పట్టాభిషేక రాయిని ‘స్టోన్ అఫ్ స్కోన్’ అని కూడా పిలుస్తారు. 152 కిలోల బరువుతో.. దీర్ఘ చతురస్ర ఆకారంలో ఉండే ఈ రాయిపై సిలువ ముద్ర ఉంటుందని ఎన్బీసీ న్యూస్ పేర్కొంది.
బైబిల్ పాత నిబంధన ప్రకారం జాకబ్ అనే పాత్ర దానిపై తల పెట్టగానే ఆ రాయి పవిత్ర భూమి నుంచి బయలుదేరి ప్రపంచం అంతా చుట్టి ఐర్లాండ్కి చేరుకుంది. అలా క్రీస్తు శకం 700 ప్రాంతంలో ఐర్లాండ్ లోని టారా పర్వతంపై దానిని ప్రతిష్టించారు. అక్కడే ఆ దేశ రాజుల పట్టాభిషేకాలు జరిగేవి.
అనంతరం స్కాట్లాండ్ సేనలు ఐర్లాండ్ను ఆక్రమించి ఈ రాయిని స్వాధీనం చేసుకున్నాయి. అయితే శాస్త్రవేత్తలు ఈ రాయి స్కాట్లాండ్ లోని స్కోన్ అనే ప్రాంతానికి చెందినదని చెబుతున్నారు. చారిత్రక ఆధారాల ప్రకారం సైతం సుమారు తొమ్మిదో శతాబ్దం నుంచి ఇది స్కాట్లాండ్ రాజుల దగ్గరే ఉంటూ వస్తోంది.
Don’t let anyone fool you your culture is your culture cherish and respect it