హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణనెలకొంది. ఏబీవీపీ విద్యార్థి సంఘం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో వివాదం చోటు చేసుకుంది.
విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణనెలకొంది. ఏబీవీపీ విద్యార్థి సంఘం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో వివాదం చోటు చేసుకుంది. ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ విద్యార్థి సంఘాల నేతలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. వివాదానికి మతపరమైన పాటలు పాడటమే కారణంగా తెలుస్తుంది. ఈ గొడవలో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలు కావడంతో క్షతగాత్రులను చందానగర్ హాస్పిటల్స్కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విద్యార్థులకు సర్దిచెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.