Telangana | రేప‌ట్నుంచే ఇంట‌ర్ వార్షిక ప‌రీక్ష ఫీజుల స్వీక‌ర‌ణ‌

Telangana | తెలంగాణ ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు వ‌చ్చే ఏడాది మార్చిలో ఇంట‌ర్ ప్ర‌థ‌మ‌, ద్వితీయ సంవ‌త్స‌రం విద్యార్థుల‌కు వార్షిక ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నుంది. ఈ నేప‌థ్యంలో పరీక్ష ఫీజుల స్వీక‌ర‌ణ‌కు సంబంధించి బోర్డు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ప్ర‌థ‌మ‌, ద్వితీయ సంవ‌త్స‌రం విద్యార్థులు ఈ నెల 14 నుంచి 30వ తేదీ లోపు సంబంధిత కాలేజీల్లో ప‌రీక్ష ఫీజుల‌ను చెల్లించొచ్చ‌ని తెలిపింది. ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ విద్యార్థుల‌తో పాటు గ‌తంలో ఫెయిలైన విద్యార్థులు, ఒకేష‌న‌ల్ విద్యార్థులు కూడా […]

Telangana | రేప‌ట్నుంచే ఇంట‌ర్ వార్షిక ప‌రీక్ష ఫీజుల స్వీక‌ర‌ణ‌

Telangana | తెలంగాణ ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు వ‌చ్చే ఏడాది మార్చిలో ఇంట‌ర్ ప్ర‌థ‌మ‌, ద్వితీయ సంవ‌త్స‌రం విద్యార్థుల‌కు వార్షిక ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నుంది. ఈ నేప‌థ్యంలో పరీక్ష ఫీజుల స్వీక‌ర‌ణ‌కు సంబంధించి బోర్డు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ప్ర‌థ‌మ‌, ద్వితీయ సంవ‌త్స‌రం విద్యార్థులు ఈ నెల 14 నుంచి 30వ తేదీ లోపు సంబంధిత కాలేజీల్లో ప‌రీక్ష ఫీజుల‌ను చెల్లించొచ్చ‌ని తెలిపింది. ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ విద్యార్థుల‌తో పాటు గ‌తంలో ఫెయిలైన విద్యార్థులు, ఒకేష‌న‌ల్ విద్యార్థులు కూడా ప‌రీక్ష ఫీజు చెల్లించొచ్చు.

ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ విద్యార్థులు రూ. 500 ప‌రీక్ష ఫీజుల చెల్లించాల్సి ఉంటుంది. ఇంట‌ర్ సెకండియ‌ర్‌లో సైన్స్ గ్రూపులు చ‌దువుతున్న స్టూడెంట్స్ ప్రాక్టిక‌ల్ ప‌రీక్ష‌ల నిమిత్తం అద‌నంగా రూ. 210 చెల్లించాలి. ఇక ఒకేష‌న్ విద్యార్థులు రూ. 710 చెల్లించాల్సి ఉంటుంద‌ని ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

రూ. 100 ఆల‌స్యం రుసుంతో డిసెంబ‌ర్ 2 నుంచి 6వ తేదీ మ‌ధ్య‌లో చెల్లించొచ్చు. రూ. 500 ఆల‌స్య రుసుంతో డిసెంబ‌ర్ 8 నుంచి 12వ తేదీ మ‌ధ్య‌లో చెల్లించొచ్చు. రూ. 1000 ఆల‌స్య రుసుంతో డిసెంబర్ 14 నుంచి 17వ తేదీ వ‌ర‌కు, రూ. 2000 ఆల‌స్య రుసుంతో డిసెంబ‌ర్ 19 నుంచి 22వ తేదీ మ‌ధ్య‌లో చెల్లించొచ్చ‌ని అధికారులు పేర్కొన్నారు.