Cable bridge పెరిగి పోతున్న అసాంఘిక కార్యకలాపాలు పోలీస్ అవుట్ పోస్టు ఉన్న ఆగని ఆగడాలు తాజాగా బండి సంజయ్ ఇద్దరి డ్రైవర్ల పై దాడి విధాత బ్యూరో, కరీంనగర్: పర్యాటక అభివృద్ధి పేరుతో కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన తీగల వంతెన అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. పర్యాటకుల మాటేమో గాని, మందు బాబులకు ఇది భూతల స్వర్గంగా మారింది.. తీగల వంతెన వద్ద జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేకంగా అవుట్ పోస్ట్ ఏర్పాటు చేసినా, […]
Cable bridge
విధాత బ్యూరో, కరీంనగర్: పర్యాటక అభివృద్ధి పేరుతో కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన తీగల వంతెన అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. పర్యాటకుల మాటేమో గాని, మందు బాబులకు ఇది భూతల స్వర్గంగా మారింది.. తీగల వంతెన వద్ద జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేకంగా అవుట్ పోస్ట్ ఏర్పాటు చేసినా, ఈ ప్రాంతాన్ని సీసీ కెమెరాల పర్యవేక్షణలోకి తీసుకువచ్చినా, అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేయడంలో పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది.
ఇటీవల తీగల వంతెన అప్రోచ్ రోడ్డు దెబ్బ తిన్నదనే వార్త కవర్ చేయడానికి వెళ్లిన ఓ టీవీ ఛానల్ కెమెరా మెన్ పై కాంట్రాక్టర్ స్వయంగా దాడికి దిగే ప్రయత్నం చేయగా, తాజాగా బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యక్తిగత డ్రైవర్లు ఇద్దరిపై గుర్తుతెలియని ఆరుగురు ఇక్కడ దాడికి దిగిన ఘటన కలకలం రేపింది. దాడికి పాల్పడింది గోదావరిఖని ప్రాంతానికి చెందిన వ్యక్తులుగా భావిస్తున్న ఎల్ఎండి పోలీసులు వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
సోమవారం తెల్లవారుజామున తీగల వంతెన పరిసరాల్లో మద్యం సేవిస్తున్న వ్యక్తులకు, గట్టు దుద్దెనపల్లి గ్రామానికి చెందిన బీజేపీ ఎంపీ వ్యక్తిగత డ్రైవర్లు బాకారపు అనీల్, కనగండ్ల ప్రశాంత్ మధ్య ఘర్షణ జరిగినట్టు సమాచారం. ఈ క్రమంలో ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు అనిల్, ప్రశాంత్ లపై దాడి చేశారు. తీగల వంతెన సమీపంలో జరిగిన దాడికి సంబంధించి అనిల్, ప్రశాంత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎల్ఎండి సీఐ ఇంద్రసేనారెడ్డి ఆరుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.