Nithiin | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో ‘పింక్’ రీమేక్ ‘వకీల్ సాబ్’ను బ్రహ్మాండంగా తెరకెక్కించి అందరి మన్ననలు అందుకున్న దర్శకుడు శ్రీరామ్ వేణు. ‘వకీల్ సాబ్’ తర్వాత తన తదుపరి చిత్రం విషయంలో మాత్రం వేణు చాలా కన్ఫ్యూజన్ని క్రియేట్ చేశాడు. ఇప్పుడు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకోబోతోన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో ‘ఐకాన్’ అనే చిత్రాన్ని ఆయన ‘వకీల్ సాబ్’ కంటే ముందే ప్రకటించారు. దిల్ రాజు ఆ చిత్రాన్ని నిర్మించనున్నట్లుగా […]
Nithiin |
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో ‘పింక్’ రీమేక్ ‘వకీల్ సాబ్’ను బ్రహ్మాండంగా తెరకెక్కించి అందరి మన్ననలు అందుకున్న దర్శకుడు శ్రీరామ్ వేణు. ‘వకీల్ సాబ్’ తర్వాత తన తదుపరి చిత్రం విషయంలో మాత్రం వేణు చాలా కన్ఫ్యూజన్ని క్రియేట్ చేశాడు. ఇప్పుడు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకోబోతోన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో ‘ఐకాన్’ అనే చిత్రాన్ని ఆయన ‘వకీల్ సాబ్’ కంటే ముందే ప్రకటించారు.
దిల్ రాజు ఆ చిత్రాన్ని నిర్మించనున్నట్లుగా ప్రకటించారు కూడా. కానీ, అల్లు అర్జున్ ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. కారణం అతని స్టార్డమ్ పెరగడమే. అలాగే ‘ఐకాన్’ స్టోరీ ఇప్పుడున్న ఇమేజ్కి సెట్ కాదని అల్లు అర్జున్ భావిస్తున్నట్లుగా.. అతని సన్నిహితుల నుంచి కొన్ని వార్తలు కూడా బయటికి వచ్చాయి. దీంతో ఈ ప్రాజెక్ట్ హోల్డ్లో పడిపోయింది. పవర్ స్టార్తో సినిమా చేసిన శ్రీరామ్ వేణును అలా ఖాళీగా ఉంచడం ఇష్టం లేక.. ఇంకో కథ రెడీ చేయమని అతనికి దిల్ రాజు మరో ఛాన్స్ ఇచ్చాడు.
దిల్ రాజు చెప్పినట్లుగానే శ్రీరామ్ వేణు ఇంకో కథని సిద్ధం చేసి.. సినిమాకు సిద్ధమయ్యాడు. తాజాగా ఆయన రెడీ చేసిన కథకు సంబంధించిన సినిమా ఓపెనింగ్ కూడా జరుపుకుంది. శ్రీరామ్ వేణు ఈసారి డైరెక్ట్ చేయబోతున్న హీరో ఎవరంటే.. నితిన్. అలాగే సినిమా పేరు కూడా ఫిక్స్ చేశారు.
సినిమా పేరేంటో తెలుసా?.. ‘తమ్ముడు’. ఈ టైటిల్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేసి ఉన్నారు. పవర్ స్టార్కి ఈ టైటిల్తో చేసిన సినిమా మంచి పేరు కూడా తెచ్చింది. ఇప్పుడీ పేరుతో పవర్ స్టార్ని అమితంగా అభిమానించే నితిన్ సినిమా చేయబోతుండటంతో.. ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు.
మరో వైపు నితిన్తో చేసిన ‘దిల్’తో ఇంటిపేరునే మార్చుకున్న దిల్ రాజు.. ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాతో అతనికి భారీ ఫ్లాప్ని ఇచ్చారు. ఆ లెక్కని కూడా ఈ సినిమాతో సరిచేయాలని ప్రతిష్టాత్మకంగా దిల్ రాజు ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఇక ఈ ‘తమ్ముడు’ ఓపెనింగ్ విశేషాలకి వస్తే.. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ ఫైనాన్షియర్ ప్రసాద్ క్లాప్ ఇవ్వగా, దర్శకుడు అనిల్ రావిపూడి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దర్శకుడు వంశీ పైడిపల్లి ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. దిల్ రాజు నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్లో నిర్మితమవుతున్న 56వ చిత్రమిది.
ఈ సినిమాకి ‘దంగల్, కహానీ, తారే జమీన్ పర్’ లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలకు పనిచేసిన సత్యజిత్ పాండే (సేతు) సినిమాటోగ్రాఫర్గా పనిచేయనున్నారు. సెప్టెంబర్ 1 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ తెలియజేస్తామని అంటున్నారు.