Site icon vidhaatha

GHMC | ఫిర్యాదు పట్టించుకోవడంలేదని.. ఆఫీసుకు పామును తెచ్చాడు

GHMC

విధాత, హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలకు వరద, మురుగు నీరు ఇళ్లలోకి వస్తోంది. అల్వాల్ ప్రాంతంలో ఓ ఇంట్లోకి పాము రావడంతో వాళ్లు ఆందోళన చెందారు. జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసి 6 గంటలు గడిచినా ఎలాంటి స్పందన రాలేదు.

దీంతో ఓపిక నశించి సంపత్ కుమార్ అనే యువకుడు అల్వాల్ జీహెచ్‌ఎంసీ వార్డు ఆఫీసుకు నేరుగా పాముతో సహా వెళ్లి టేబుల్ పై పెట్టి తన నిరసన తెలిపారు. యువకుడి చర్యతో ఖంగుతున్న జీహెచ్‌ఎంసీ ఆఫీస్ సిబ్బంది పామును చూసి హడలిపోయారు. ఈ చర్య నెట్టింట వైరల్‌గా మారింది.

Exit mobile version