Warangal | విధాత, వరంగల్ ప్రతినిధి: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయిలో వరద నీటిలో పది మంది కొట్టుకుపోయారు. స్థానికులు, సహాయక బృందాలు గల్లంతయిన వారి కోసం గాలింపు చేపట్టారు. వరద ఉధృతికి సమీప బంగ్లాలు ఎక్కిన ప్రజలు సహాయం కోసం బిక్కుబిక్కుమంటు ఎదురుచూస్తున్నారు. అటు హనుమకొండ గోపాలపురం చెరువులో గట్టు రాజు(40) గల్లంతయ్యాడు. వెల్మెరు మండలం కన్నారంలో బైక్పై వాగు దాటేందుకు ప్రయత్నించిన మహేందర్ గల్లంతవ్వగా స్థానికుల గాలింపులో మృతదేహం లభ్యమైంది. మహబూబాబాద్ జిల్లా […]
Warangal |
విధాత, వరంగల్ ప్రతినిధి: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయిలో వరద నీటిలో పది మంది కొట్టుకుపోయారు. స్థానికులు, సహాయక బృందాలు గల్లంతయిన వారి కోసం గాలింపు చేపట్టారు. వరద ఉధృతికి సమీప బంగ్లాలు ఎక్కిన ప్రజలు సహాయం కోసం బిక్కుబిక్కుమంటు ఎదురుచూస్తున్నారు.
అటు హనుమకొండ గోపాలపురం చెరువులో గట్టు రాజు(40) గల్లంతయ్యాడు. వెల్మెరు మండలం కన్నారంలో బైక్పై వాగు దాటేందుకు ప్రయత్నించిన మహేందర్ గల్లంతవ్వగా స్థానికుల గాలింపులో మృతదేహం లభ్యమైంది. మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలం పోచంపల్లిలో వరదలో కొట్టుకుపోయి అన్నదమ్ములు పిండి యాకయ్య, పిండి శ్రీనివాస్ లు మృతి చెందారు.
వారి కుటుంబాలను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు పరామర్శించారు. ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వరంగల్ హంటర్ వీధిలో ఇంటర్ బాలికల హాస్టల్ చుట్టు వరద నీరు చేరడంతో 270మంది బాలికలు భవనంపైకి ఎక్కి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.
వారికి బోట్లలో ఆహారం, మంచినీళ్లు అందిస్తున్నారు.వరంగల్ భద్రకాళీ ఆలయ సమీపంలో సరస్వతి కాలనీలో వరదల్లో చిక్కుకుని భవనాలపైకి చేరుకున్న బాధితులు మంచినీళ్లు, ఆహారం కోసం ఎదురుచూస్తున్నారు. వారికి సహాయం అందించేందుకు అధికారులు, సహాయక బృందాలు ప్రయత్నిస్తున్నాయి.