లోకసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతాం.. లీకేజీల కుట్ర బీజేపిదే పసిపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నా బీజేపి వరంగల్ లీకేజీ కుట్రలో అరెస్ట్ అయిన ప్రశాంత్ బీజేపీ కార్యకర్తనే మెదక్ మీడియా సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రశాంత్ బీజేపీ జాతీయ నాయకులతో ఉన్న ఫోటోలను మీడియాకు విడుదల చేసిన మంత్రి విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: 10th పేపర్ లీకేజీ కుట్ర ముమ్మాటికీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కనుసన్నల్లో […]
విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: 10th పేపర్ లీకేజీ కుట్ర ముమ్మాటికీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కనుసన్నల్లో జరిగిందని లీకేజీ కేసులో అరెస్ట్ ఐన ప్రశాంత్ అనే వ్యక్తి బీజేపీ సంబందించిన కార్యకర్త అని ,నిందితుడి బీజేపి అగ్ర నేతలతో కలసి ఉన్న ఫోటోలను మీడియాకు విడుదల చేశారు.బుదవారం మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో మంత్రి హరీష్ రావు , ఎమ్మెల్సీ మల్లేశం,ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఇఫ్కొ డైరెక్టర్ దేవేందర్ రెడ్డి తో కలసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మంత్రి హరీష్ రావు మాట్లాడారు.
బీఆర్ఎస్ ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక బీజేపీ పసి పిల్లలతో క్షుద్ర రాజకీయం చేస్తోందన్నారు.
నిన్న బండి సంజయ్ కుట్ర నగ్నంగా బయట పడింది. బీజేపీ ఇంత నిస్సిగ్గుగా వ్యవహరిస్తుందా అని దేశ రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారనీ మండి పడ్డారు. భవిష్యత్ తరాలకు బీజేపీ సందేశం ఇవ్వదలుచుకుందిఇదేనా అని ప్రశ్నించారు. బండి సంజయ్ రెడ్ హ్యాండెడ్ గా దొరికి పోయినా బుకాయిస్తున్నారన్నారు. విద్యార్థులు బీజేపీ కుట్రలను గమనించాలి. బీజేపీ కి చదువు విలువ తెలియదు.
బీజేపీ లో చదుకున్నోళ్లు తక్కువ. పేపర్ లీకేజీ లో బండి సంజయ్ ప్రధాన కుట్ర దారనీ హరీష్ రావు ఆరోపించారు. తాండూరు లో లీకేజీ కి పాల్పడ్డ టీచర్ బీజేపీ ఉపాధ్యాయ సంఘం లో ఉన్నారనీ చెప్పారు. నిన్న అరెస్టయిన ప్రశాంత్ బీజేపీ లో ఉన్నారు. ప్రశాంత్ కు బీజేపీ అగ్రనేతలతో సంబంధాలు ఉన్నాయి.ఇవిగో ఆధారాలనీ ఆయన జాతీయ బీజేపీ నాయకులు లక్ష్మన్,బండి సంజయ్, నడ్డ, గవర్నర్ బండారు దత్తాత్రేయ తదితరుల తో ప్రశాంత్ కలసి ఉన్న ఫోటోలను మీడియాకు వెల్లడించారు.
నిన్న మధ్యాహ్నం పేపర్ లీకేజీ జరిగిందని బీజేపీ ధర్నా చేసింది… సాయంత్రం నిందితులను విడుదల చేయాలని మళ్లీ ధర్నా చేసింది. బీజేపీ కి ఈ ఘటనతో సంబంధం ఉందని తేలిపోయిందనీ మంత్రి హరీష్ రావు అన్నారు. నడ్డా సంజయ్ ను సమర్ధించడం సిగ్గు చేటు. పట్టపగలు బీజేపీ నగ్నం గా చిక్కింది GHMC ఎన్నికలప్పుడు, TSPSC లీకేజీ లో ,ఎమ్మెల్యేల కొనుగోలు లో బీజేపీ కుట్రలు రెడ్ హ్యాండెడ్ గా బయట పడ్డాయ నీ మండి పడ్డారు.
బండి సంజయ్ కు కొన్ని సూటి ప్రశ్నలు వేయ దలుచుకున్నా. పదో తరగతి ప్రశ్నా పత్రం వాట్సాప్ లో ప్రచారం చేసిన ప్రశాంత్ బీజేపీ కార్యకర్త కాదా ప్రశాంత్ ప్రశ్న పత్రాన్ని నీకు వాట్సాప్ లో పంపింది నిజమా కాదా. రెండు గంటల్లో 142 సార్లు నీతో నిందితుడు ఫోన్లో మాట్లాడింది నిజమా కాదా. పనిగట్టుకుని ప్రశ్నాపత్రాలను మీడియా గ్రూపులకు, వెబ్సైట్ లకు మీ ప్రోద్భలం తో పంపింది నిజం కాదా అని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు.
ప్రశ్న పత్రం వ్యాప్తి లో నీ ప్రమేయం లేకుంటే నీకు నిందితుడు ఇచ్చిన సమాచారాన్ని ఎందుకు దాచావ్. రోజుకో ప్రశ్న పత్రం వాట్సాప్ లో వ్యాప్తిచేయించాలని నీవు కుట్ర పన్నింది నిజం కాదా. సోషల్ మీడియా లో ప్రశ్న పత్రాల లీకేజీ అంటూ ప్రభుత్వాన్ని బద్నాం చేసేలా పోస్టులు పెట్టింది బీజేపీ కార్యకర్తలు కాదా. ప్రశ్నా పత్రాలు నిందితుడు మీకు పంపితే తప్పేమిటని మీ ఎమ్మెల్యే రఘునందన్ రావు నిస్దిగ్గుగా సమర్ధిస్తున్నారు. ప్రశ్న పత్రం మీకు 11.20 కి పంపానని నిందితుడు చెప్పారు.వాట్సాప్ రికార్డుల్లో కూడా ఉందన్నారు.
పదో తరగతి పరీక్ష సమయం ఉదయం 9.30 నుంచి 12.30 గంటల వరకు. ఈ మధ్యలో ఎవరు ఎవరికి షేర్ చేసినా అది నిబంధనలకు విరుద్ధమని తెలియదా. మీ ఎమ్మెల్యేకు నిబంధనలు తెలియవా ఎంపీ గా ఉన్న మీకు కూడా నిబంధనలు తెలియవా. ఇంత నిస్దిగ్గుగా తప్పుడు చర్యలను సమర్ధిస్తున్న మీరు ఓ జాతీయ పార్టీ శాఖ కు అధ్యక్షుడిగా ఎలా కొనసాగుతారన్నారు. మీ చర్యలకు మీ అధిష్టానం మద్దతు ఉందా. యూపీ, గుజరాత్ లలో పేపర్ లీకేజీలు నిత్య కృత్యమే. అక్కడి ప్రభుత్వాల నుంచి ఇక్కడ పేపర్లు లీకు చేయడానికి మీరు అనుభవం గడించారా. నీ ప్రశ్నల్లో పస లేదు .నువ్వు ప్రశ్నిస్తే బెంబేలెత్తడానికి ఏం లేదు.
చట్టం తన పని తాను చేసుకు పోతుంది. విద్యార్థుల జీవితాల తో ఆడుకునే వారిని వదిలి పెట్టే ప్రసక్తే లేదనీ మంత్రి అన్నారు. ముగ్గుర్ని ప్రభుత్వ ఉద్యోగుల పై ఇప్పటికే చర్యలు తీసుకున్నాం
ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తే యువత బీజేపీ కి దూరమవుతుందని నువ్వే బహిరంగంగా ప్రకటించావు
ఆ ప్రకటనకు దగ్గట్టే నీ చేష్టలు ఉన్నాయి.
ప్రతి చిన్న ఘటనకు కేసీఆర్ కు ఆపాదించే నువ్వు సమాజం లో తలవంచుకునే చర్యకు పాల్పడ్డ0దుకు ఏం చేయాలి. రాష్ట్రాన్ని నువ్వు ఏం చేద్దామనుకుంటున్నావ్. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లాగా మీ గుండా గిరి తెలంగాణ లో ఎట్టి పరిస్థితుల్లో అనుమతించం మని అన్నారు. బీజేపీ కి బండి చేతిలోనే మూడినట్టుంది
కేసీఆర్ ముందు నీ పప్పులు ఉడకవు. హనుమంతుడి ముందు కుప్పి గంతులు మానండి.
మీకు ఫేక్ డిగ్రీలు కామన్ కావచ్చు.. కానీ ఎంతో మంది కష్టపడి చదివే విద్యార్థుల జీవితాలతో చేలాగాటమాడవద్దు.
బీజేపీ విష ప్రచారాన్ని విద్యార్థులు నమ్మొద్దునీ మంత్రి హరీష్ రావు కోరారు. తెలంగాణ ను ఆగం చేసేందుకు బీజేపీ ఎంతకైనా తెగిస్తుంది.. దాన్ని కేసీఆర్ ఎదుర్కొంటారు. బీజేపీ కుట్రలు చేదిస్తూనే ఉంటాం.. తెలంగాణ ను కంటికి రెప్పలా కాపాడుకుంటాం. చట్టం ఎవరికైనా ఒక్కటే బండి సంజయ్ పై అనర్హత వేటు వేయాలని లోక్ సభ స్పీకర్ ను కోరుతున్నాం .బ్రబుత్వం లోతైన విచారణ చేస్తుందన్నారు