Basara | వాడిపోయిన కూరగాయలతో వంటలు విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా బాసర బీసీ హాస్టల్ లో విద్యార్థులకు పురుగులతో కూడిన అన్నం, కుళ్లిన కూరగాయలతో కూరలు వండి పెడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పురుగుల అన్నం తినలేక ఖాళీ కడుపుతో పడుకోవాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ హాస్టల్ లో సన్న బియ్యంతో కూడిన భోజనం పెడుతున్నామని చెప్పిన నాయకులు, పెడుతున్న భోజనము లో పురుగులు వచ్చిన […]
Basara |
వాడిపోయిన కూరగాయలతో వంటలు
విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా బాసర బీసీ హాస్టల్ లో విద్యార్థులకు పురుగులతో కూడిన అన్నం, కుళ్లిన కూరగాయలతో కూరలు వండి పెడుతున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పురుగుల అన్నం తినలేక ఖాళీ కడుపుతో పడుకోవాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ హాస్టల్ లో సన్న బియ్యంతో కూడిన భోజనం పెడుతున్నామని చెప్పిన నాయకులు, పెడుతున్న భోజనము లో పురుగులు వచ్చిన పట్టించుకోవడం లేదని, పురుగులు లేని బియ్యం పంపిణీ చేయాలని కోరారు.
తాగడానికి మంచి నీరు లేక ఇబ్బంది పడుతున్నామని, వాటర్ ప్యూరిఫై పది రోజుల నుంచి పనిచేయడం లేదని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి దీనిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.