నీట్ పేపర్ లీకేజీ..విద్యా వ్యవస్ధలో లోపాలపై కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నిరసనల దెబ్బకు దిగొచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ తన పాలన వైఫల్యాలను సరిదిద్దుకునే ప్రయత్నంతో పాటు జెన్ జీ యువతను ఆకట్టుకునే పనిలో పడ్డారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేదాక పట్టువీడని పోరాటం సాగించి.. ప్రతిపక్షాలకు సైతం సాధ్యం కాని రీతిలో మోదీ సర్కార్ మెడలు వంచిన జెన్ జీ యువత తమ శక్తిని దేశానికి చాటింది. ఈ నేపథ్యంలో తన ప్రభుత్వం పట్ల జెన్ జీ యువతలో నెలకొన్న అసంతృప్తిని చల్లార్చి..వారిని ప్రసన్నం చేసుకుని దగ్గరయ్యే ఎత్తులకు ప్రధాని పదును పెడుతున్నారు. ఇందుకు ప్రధానంగా సోషల్ మీడియాను సాధనంగా మార్చుకోవాలని ప్రధాని మోదీ భావిస్తున్నట్లుగా కనబడుతుంది. విద్యార్ధులు, యువత నిరసనల సందర్భంగా తన సందేశం అందించేందుకు సోషల్ మీడియా వేదికగా తన తొలి సెల్ఫీ వీడియోను విడుదల చేసిన ప్రధాని మోదీ తాజాగా నిర్వహించిన కేంద్ర కేబినెట్ సమావేశంలో సైతం మంత్రులందరికి సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండాలని సూచించారు.
అంతేకాదు స్వయంగా మోదీ ప్రధాని మోదీ సోషల్ మీడియాలో నాలుగు రోజుల్లో మూడు ఇన్ స్టా రీల్ వీడియోలు విడుదల చేయడం ఆసక్తికరం. తొలుత పేపర్ లీకేజీల నియంత్రణకు కేంద్రం తీసుకరానున్న చట్టపరమైన చర్యలను వివరిస్తూ మోదీ ఓ వీడియో ద్వారా వివరించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాగా వరుసగా మరో రెండు వీడియోలు విడుదల చేశారు.
ఎగ్జామినేషన్ రీఫార్మ్స్ కోసం హై పవర్డ్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
తాజాగా మోదీ విడుదల చేసిన వీడియోలో పరీక్షల సంస్కరణలకు కేంద్రం తీసుకుంటున్న చర్యలను వివరించారు. విద్యార్థుల భవిష్యత్ కోసం నిరంతరం చర్యలు తీసుకుంటున్నాం అని..ఇందుకోసం నందన్ నీలేకని నేతృత్వంలో ఎగ్జామినేషన్ రీఫార్మ్స్ పై హైపవర్డ్ టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేశామని తన సెల్పీ వీడియోలో వెల్లడించారు. పరీక్షలలో అక్రమాల నివారణే లక్ష్యంగా కేంద్రం చర్యలు తీసుకుంటుందని, పరీక్ష విధానం విశ్వసనీయంగా, పారదర్శకంగా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలిపారు. టాస్క్ ఫోర్స్ నివేదిక ఆధారంగా రాబోయో పరీక్షలను నిర్వహిస్తామని మోదీ పేర్కొన్నారు. నీట్ పేపర్ లీక్కు పాల్పడినవారు ప్రస్తుతం జైల్లో ఉన్నారని..పార్లమెంటులో పేపర్ లీకేజీల నియంత్రణకు, పరీక్షల సక్రమ నిర్వహణకు కఠిన నియమాలతో కొత్త చట్టం తీసుకొస్తున్నామని తెలిపారు.
ఎగ్జామినేషన్ రీఫార్మ్స్ హై పవర్డ్ టాస్క్ ఫోర్స్ వివరాలు..
ఎగ్జామినేషన్ రీఫార్మ్స్ హై పవర్డ్ టాస్క్ ఫోర్స్ ను ఇన్పోసిస్ కో ఫౌండర్, టెక్నాలాజీ ఎక్స్ పర్ట్ నందన్ నీలేఖని లీడ్ చేస్తారు., పరీక్షల్లో హైటెక్ వినియోగంపై ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్ మార్గదర్శకం చేస్తారని, ఐఐటీ మద్రాస్ డైరక్టర్ ప్రొఫెసర్ కామకోటి అకడమిక్, రీసెర్చ్ విషయాలపై సూచనలు చేస్తారని, ఐఏఎస్ అనితా కార్వాల్ పరీక్షల నిర్వహణను పర్యవేక్షిస్తారరని, మాజీ ఐబీ చీఫ్ తపన్ డేకా క్రిమినల్ లూప్ హోల్స్, సెక్యూరిటీ సమస్యలను గుర్తించి పరిష్కార చర్యలను సూచిస్తారు.
మరో వీడియోతో కీలక ప్రకటన చేసిన ప్రధాని మోదీ
దేశంలో పరీక్షా విధానాన్ని మరింత పారదర్శకంగా, విశ్వసనీయంగా మార్చే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఇందుకోసం ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, టెక్ నిపుణుడు నందన్ నీలేకని నేతృత్వంలో ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్… pic.twitter.com/dV0ZIQN8qc
— TeluguBulletin.com (@TeluguBulletin) July 27, 2026
