Road accident | శుభకార్యానికి వెళ్లి వస్తూ ఒకే గ్రామానికి చెందిన తొమ్మిది మంది అనంత లోకాల్లో కలిసిపోయారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెమెతార జిల్లాలోని కతియా గ్రామం సమీపంలో ఆగి ఉన్న స్వరాజ్ మజ్దా గూడ్స్ ట్రక్కును వెనుక నుంచి వచ్చిన మినీ లారీ ఢీకొట్టింది. ఈ ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 23 మందికి గాయాలయ్యాయి.
Road accident : శుభకార్యానికి వెళ్లి వస్తూ ఒకే గ్రామానికి చెందిన తొమ్మిది మంది అనంత లోకాల్లో కలిసిపోయారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెమెతార జిల్లాలోని కతియా గ్రామం సమీపంలో ఆగి ఉన్న స్వరాజ్ మజ్దా గూడ్స్ ట్రక్కును వెనుక నుంచి వచ్చిన మినీ లారీ ఢీకొట్టింది. ఈ ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 23 మందికి గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గాయపడిన వారిలో నలుగురు మరణించారు. దాంతో మొత్తం మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది.
మృతుల్లో ఆరుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. బెమెతార జిల్లాలోని తిరయ్య గ్రామానికి చెందిన 50 మంది ఆదివారం పతర్ర గ్రామంలో జరిగిన ఫ్యామిలీ ఫంక్షన్లు వెళ్లారు. ఫంక్షన్ అనంతరం స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ఆదివారం అర్ధరాత్రి (తెల్లవారితే సోమవారం) 2.30 గంటల ప్రాంతంలో వారు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదం బారినపడింది. కతియా గ్రామం సమీపంలో వారు ప్రయాణిస్తున్న స్వరాజ్ మజ్దా గూడ్స్ వాహనాన్ని మూత్ర విసర్జన కోసం ఆపగా.. వెనుక నుంచి వచ్చిన మినీ ట్రక్కు బలంగా ఢీకొట్టింది.
స్థానికుల ద్వారా ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు హుటాహటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం బెమెతార ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. ఈ ప్రమాదంతో తిరయ్య గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామంలో ఒకేసారి 9 మంది ప్రాణాలు కోల్పోవడం గ్రామస్తులను దిగ్భ్రాంతికి గురిచేసింది.