రోడ్డు ప్రమాదాలు…15మంది దుర్మరణం

హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటకలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 15 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడగా, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

పలు రాష్ట్రలలో జరిగిన వేర్వేరు రాష్ట్రాల రోడ్డు ప్రమాదాలలో 15మంది దుర్మణం చెందారు. హిమాచ‌ల్ ప్రదేశ్‌ చంబా జిల్లాలోని చురా స‌బ్‌డివిజ‌న్‌లో బస్సు బోల్తా పడి 7గురు మృతి చెందారు. 20 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ బస్సు మూలమలుపు వద్ద అదుపుతప్పి కొండపై నుంచి కింద రోడ్డుపై పడిపోయింది. చంబా నుంచి బైరాఘ‌ర్‌కు వెళ్తున్న బస్సు చాలుంజ్ మ‌లుపు వ‌ద్ద అదుపు తప్పి, కింద ఉన్న మరో రోడ్డుపై బస్సు పడిపోయింది. తలక్రిందులుగా బస్సు పడటంతో.. అక్కడికక్కడే 7 మంది మృతి చెందగా, మరో 11 మందికి గాయాలు అయ్యాయి. మృతుల్లో డ్రైవర్, కండక్టర్‌తో పాటు నలుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నట్లు సమాచారం. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.ఘటనా స్థలానికి వెంటనే చేరుకొని.. స్థానిక ప్రజల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు.

ఉత్తరాఖండ్ లో దేవప్రయాగ్-పౌరీ రహదారి వద్ద బొలెరో వాహనం లోయలో పడిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. ఓ మహిళ, మూడేళ్ల చిన్నారితో సహా ఆరుగురు మృతి చెందారు.

కర్ణాటకలో కోజికోడ్‌ – బెంగళూరు బస్సు బోల్తా కొట్టిన ప్రమాదంలో మరో ఇద్దరు మృతి చెందారు. వర్షంలో అదుపుతప్పిన కేఎస్‌ఆర్‌టీసీ బస్సు బిడాడి సమీపంలో ఓవర్‌హెడ్‌ సైన్‌బోర్డు నిర్మాణాన్ని ఢీకొట్టి బోల్తా పడింది.ఈ ప్రమాదంలో డ్రైవర్‌ మిథిలేష్‌, కండక్టర్‌ అరుణ్‌ మృతి చెందారు. మరో 14 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Latest News