INDIA meet | ఖర్గే నివాసంలో ఇండియా కూటమి మీటింగ్‌.. ప్రభుత్వ ఏర్పాటు అవకాశాలపైనే కీలక చర్చ..!

INDIA meet | ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీకి సొంత మెజారిటీ రాకపోవడంతో అటు అధికార కూటమి, ఇటు ప్రతిపక్ష కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. వాస్తవానికి బీజేపీ మ్యాజిక్‌ ఫిగర్‌ అందుకోకపోయినా ఎన్డీఏ కూటమికి స్పష్టమైన మెజారిటీ దక్కింది. కానీ ఎన్డీఏ కూటమిలోని జేడీయూను, టీడీపీని తమవైపు మలుపుకుంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని ప్రతిపక్ష కూటమి ఆలోచన చేస్తోంది.

  • Publish Date - June 5, 2024 / 08:25 PM IST

INDIA meet : ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీకి సొంత మెజారిటీ రాకపోవడంతో అటు అధికార కూటమి, ఇటు ప్రతిపక్ష కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. వాస్తవానికి బీజేపీ మ్యాజిక్‌ ఫిగర్‌ అందుకోకపోయినా ఎన్డీఏ కూటమికి స్పష్టమైన మెజారిటీ దక్కింది. కానీ ఎన్డీఏ కూటమిలోని జేడీయూను, టీడీపీని తమవైపు మలుపుకుంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని ప్రతిపక్ష కూటమి ఆలోచన చేస్తోంది.

ఈ నేపథ్యంలోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు గల అవకాశాలను సమీక్షించేందుకు ‘ఇండియా’ (INDIA) కూటమి నేతలు సమావేశమయ్యారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయనతోపాటు ఆ పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, ఎన్‌సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్, జేఎఎం ఎమ్మెల్యే కల్పనా సోరెన్ తదితరులు పాల్గొన్నారు.

శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధ్యక్షురాలు మమతా బెనర్జి ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. అయితే ఉద్ధవ్ థాకరే తరఫున సంజయ్ రౌత్, టీఎంసీ తరఫున అభిషేక్ బెనర్జి ‘ఇండియా’ కూటమి సమావేశానికి హాజరయ్యారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవిని చేపట్టేందుకు అంగీకరిస్తే తాము మద్దతు ప్రకటిస్తామని సమావేశానికి ముందు సంజయ్ రౌత్ మీడియాకు తెలిపారు. ‘ఇండియా’ కూటమి తరఫున ఎవరు ప్రధానమంత్రి అవుతారనే దానిపై కూటమి నేతల్లో ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవన్నారు.

Latest News