విధాత: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా జలాల వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్.వి.రమణ సూచించారు. కృష్ణా జలాల వివాదంపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. రెండు రాష్ట్రాలతో సంప్రదించి పిటిషన్పై నిర్ణయం తీసుకోవాలని ఇరు రాష్ట్రాల సీనియర్ న్యాయవాదులకు సీజేఐ సూచించారు