16న సీఎం రేవంత్ రెడ్డి.. స్టేషన్ ఘనపూర్ పర్యటన

- ఏడాదిలో రూ.800కోట్ల అభివృద్ధి పనులు మంజూరు
- మధ్యాహ్నం 12 గంటలకు సభా స్థలికి చేరుకుంటారు
- 50వేల మందితో భారీ బహిరంగ సభ
- సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి
విధాత ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 16వ తేదీన స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రూ.800 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. సీఎం రాక సందర్భంగా 50 వేల మందితో భారీ బహిరంగ సభ కోసం ఏర్పాటు చేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల నుంచి పార్టీ శ్రేణులను సమీకరించినందుకు స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎంపీ కడియం కావ్య ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. బహిరంగ సభ ఏర్పాట్లను డాక్టర్ కడియం కావ్య, జనగామ జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కడియం శ్రీహరి, కావ్య మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం లో 800కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చెయడానికి వస్తున్నట్లు వివరించారు. ఆదివారం మధ్యాహ్నం సభను నిర్వహిస్తున్నట్లు, ఈ సభను నియోజకవర్గ ప్రజలు, మహిళలు, రైతులు, యువకులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి జయప్రదం చేయాలని కోరారు.
శంకుస్థాపనలు చేయనున్న అభివృద్ధి పనులకు టెండర్లు పూర్తి అయి అగ్రిమెంట్లు కూడా అయ్యాయని, వెంటనే పనులు ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు. ఈ పనులను 18నెలలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి వచ్చే విదంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఒక్క ఏడాదిలోనే నియోజకవర్గ అభివృద్ధికి 800కోట్ల పైచిలుకు నిధులు కేటాయించారాని, ఇంత పెద్ద మొత్తంలో ఏ నియోజకవర్గానికి నిధులు మంజూరు కాలేదని నియోజకవర్గ ప్రజల పట్ల సీఎం ప్రేమకు నిదర్శనమని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.