అమరులబాటలో ముందుకు సాగుదాం.. ఘనంగా చండ్రపుల్లారెడ్డి వర్ధంతి

పీడిత ప్రజాపోరులో ఎందరో తమ ప్రాణాలర్పించారని, అమరుల త్యాగాల బాటలో ముందుకు సాగాలని పిలుపు నిచ్చారు. సిపిఐ ఎంఎల్ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి చండ్ర పుల్లారెడ్డి 41 వ వర్ధంతి ఆదివారం ఘనంగా నిర్వహించారు. న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ నవంబర్ 1 నుండి 9 వరకు అమరవీరుల సంస్మరణ సభలు జరపాలని ఇచ్చిన పిలుపుమేరకు పడమరకోట లోని విద్యార్థి అమరవీరుల స్థూపం వద్ద పుల్లారెడ్డి వర్ధంతిని న్యూడెమోక్రసీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా జరిపారు.

  • By: Subbu |    news |    Published on : Nov 09, 2025 4:47 PM IST
అమరులబాటలో ముందుకు సాగుదాం.. ఘనంగా చండ్రపుల్లారెడ్డి వర్ధంతి

విధాత, వరంగల్ : పీడిత ప్రజాపోరులో ఎందరో తమ ప్రాణాలర్పించారని, అమరుల త్యాగాల బాటలో ముందుకు సాగాలని పిలుపు నిచ్చారు. సిపిఐ ఎంఎల్ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి చండ్ర పుల్లారెడ్డి 41 వ వర్ధంతి ఆదివారం ఘనంగా నిర్వహించారు. న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ నవంబర్ 1 నుండి 9 వరకు అమరవీరుల సంస్మరణ సభలు జరపాలని ఇచ్చిన పిలుపుమేరకు పడమరకోట లోని విద్యార్థి అమరవీరుల స్థూపం వద్ద పుల్లారెడ్డి వర్ధంతిని న్యూడెమోక్రసీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా జరిపారు.

పార్టీ గ్రేటర్ వరంగల్ కార్యదర్శి రాచర్ల బాలరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి ఎలకంటి రాజేందర్, జిల్లా అధికార ప్రతినిధి గంగుల దయాకర్, మానవ హక్కుల వేదిక జిల్లా నాయకులు బండి కోటేశ్వరరావు, పిడిఎస్యూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గుర్రం అజయ్ మర్రి మహేష్ లు మాట్లాడారు. ఈ సందర్భంగా విప్లవోద్యంలో అసువులుబాసిన నాయకులకు నివాళులర్పించారు.

అనంతరం జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ చండ్ర పుల్లారెడ్డి విద్యార్థి దశ నుండి కమ్యూనిస్టు ఉద్యమాల్లో పాల్గొన్నారని సిపిఐ, సిపిఎం రివిజనిస్టు రాజకీయాలను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా, విప్లవకారులను ఏకం చేస్తూ సిపిఐ ఎంఎల్ పార్టీ ఏర్పాటుకు కృషి చేశాడని అన్నారు , గోదావరి నది పరివాహక ప్రాంతంలోని అటవీ మైదాన ప్రాంతాలలో గిరిజన, గిరిజనేతర పేదలను కూడగట్టి ప్రతిఘటనా పోరాటాలు నిర్మించి10 లక్షల ఎకరాలకు పైగా పేద ప్రజలు సాగు చేసుకొనుటకు నాయకత్వం వహించాడని తెలిపారు.

నేడు కేంద్రంలోని మోడీ అమిత్ షా ల ప్రభుత్వం పార్లమెంటును అడ్డం పెట్టుకొని బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్టు విధానాలను అమలు చేస్తూ అమెరికా తదితర సామ్రాజ్యవాద దేశాలకు దళారీగా పనిచేస్తుందని విమర్శించారు. మధ్యభారతంలో అమలు జరుపుతున్న ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోఅరుణోదయ నాయకులు నళిగంటి విజయ పాల్, బండి కుమార్, బన్న నర్సింగం, మహమ్మద్ ఖాన్, గద్దల ప్రభాకర్, గండ్రతి హరిబాబు, మైదం సంజీవ, సుద్దాల వీరయ్య, మన్ని నారాయణ, సాంబయ్య, బండి వెంకటేశ్వర్లులతోపాటు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.