Padma Awards: పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం.. నందమూరి బాలకృష్ణ, అజిత్లకు పద్మ భూషణ్

విధాత: కేంద్ర ప్రభుత్వ కొంత సేపటి క్రితం ప్రతిష్టాత్మక అవార్డులను ప్రకటించింది. వీటితో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, నటి వైజయంతి మాలకు పద్మవిభూషణ్, మిథున్ చక్రవర్తి, ఉషా ఉతప్లకు పద్మభూషణ్ ప్రకటించింది. అదేవిధంగా టాలీవుడ్ నుంచి నటసింహం నందమూరి బాలకృష్ణకు, తమిళ స్టార్ అజిత్ లకు సైతం పద్మ భూషణ్ ప్రకటించింది.
పద్మ విభూషణ్ గ్రహీతలు
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు,
నటి వైజయంతి మాల
దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి (వైద్యం) తెలంగాణ
జస్టిస్ జగదీశ్ ఖేహర్ (రిటైర్డ్) (ప్రజా వ్యవహారాలు) – చండీగఢ్
కుముదిని రజినీకాంత్ లాఖియా (కళలు) గుజరాత్
లక్ష్మీనారాయణ సుబ్రమణియం (కళలు) కర్ణాటక
ఎం.టి.వి. వాసుదేవన్ నాయర్ (మరణానంతరం) (సాహిత్యం, విద్య) – కేరళ
ఓసాము సుజుకీ (మరణానంతరం) (వాణిజ్యం, పరిశ్రమలు) – జపాన్
శారదా సిన్హా (కళలు) – బిహార్
పద్మభూషణ్ గ్రహీతలు
నందమూరి బాలకృష్ణ (కళలు) – ఆంధ్రప్రదేశ్
ఎ. సూర్యప్రకాశ్ (సాహిత్యం, విద్య, జర్నలిజం) కర్ణాటక
అనంత్ నాగ్ (కళలు) – కర్ణాటక
బిబేక్ దెబ్రాయ్ (మరణానంతరం) (సాహిత్యం, విద్య) – ఎన్సీటీ దిల్లీ
జతిన్ గోస్వామి (కళలు) – అస్సాం
జోస్ చాకో పెరియప్పురం (వైద్యం) – కేరళ
కైలాశ్ నాథ్ దీక్షిత్ (ఇతర- ఆర్కియాలజీ) ఎన్సీటీ దిల్లీ
మనోహర్ జోషీ (మరణానంతరం) (ప్రజావ్యవహారాలు) – మహారాష్ట్ర
నల్లి కుప్పుస్వామి చెట్టి (వాణిజ్యం, పరిశ్రమలు) తమిళనాడు
పీఆర్ శ్రీజేశ్ (క్రీడలు) – కేరళ
పంకజ్ పటేల్ (వాణిజ్యం, పరిశ్రమలు) గుజరాత్
పంకజ్ ఉదాస్ (మరణానంతరం) (కళలు) మహారాష్ట్ర
రామ్బహదుర్ రాయ్ (సాహిత్యం, విద్య, జర్నలిజం) – ఉత్తరప్రదేశ్
సాధ్వీ రీతంభర (సామాజిక సేవ) – ఉత్తరప్రదేశ్
ఎస్.అజిత్ కుమార్ (కళలు) – తమిళనాడు
శేఖర్ కపూర్ (కళలు) – మహారాష్ట్ర
శోభన చంద్రకుమార్ (కళలు) – తమిళనాడు
సుశీల్ కుమార్ మోదీ (మరణానంతరం) (ప్రజావ్యవహారాలు) – బిహార్
వినోద్ ధామ్ (సైన్స్ అండ్ ఇంజినీరింగ్) అమెరికా
పద్మ అవార్డు గ్రహతలు వీరే
జోనస్ మాశెట్టి (వేదాంత గురు) – బ్రెజిల్
హర్వీందర్సింగ్ (పారాలింపియన్ గోల్డ్మెడల్ విన్నర్) – హరియాణా
భీమ్ సింగ్ భవేష్ (సోషల్ వర్క్) – బిహార్
పి. దక్షిణా మూర్తి (డోలు విద్వాంసుడు)- పుదుచ్చేరి
ఎల్. హంగ్ంగ్ (వ్యవసాయం-పండ్లు)- నాగాలాండ్
బేరు సింగ్ చౌహాన్ (జానపద గాయకుడు) మధ్యప్రదేశ్
షేఖా ఎ.జె. అల్ సబాహ్ (యోగా)- కువైట్
నరేన్ గురుంగ్ (జానపద గాయకుడు) నేపాల్
హరిమన్ శర్మ (యాపిల్ సాగుదారు) హిమాచల్ ప్రదేశ్
జుమ్టే యోమ్మ్ గామ్లిన్ (సామాజిక కార్యకర్త)- అరుణాచల్ ప్రదేశ్
విలాస్ దాంగ్రే (హోమియోపతి వైద్యుడు) మహారాష్ట్ర
వెంకప్ప అంబానీ సుగటేకర్ (జానపద గాయకుడు) – కర్ణాటక
నిర్మలా దేవి (చేతి వృత్తులు) – బిహార్
జోయ్నచరణ్ బతారీ (థింసా కళాకారుడు)- అస్సాం
సురేశ్ సోనీ (సోషల్వర్క్- పేదల వైద్యుడు)- గుజరాత్
రాధా బహిన్ భట్ (సామాజిక కార్యకర్త)- ఉత్తరాఖండ్
పాండి రామ్ మాండవి (కళాకారుడు) చత్తీస్ ఘడ్
లిబియా లోబో సర్దేశాయ్ (స్వాతంత్య్ర సమరయోధురాలు) – గోవా
గోకుల్ చంద్ర దాస్ (కళలు)- పశ్చిమ బెంగాల్
సాల్లీ హోల్కర్ (చేనేత)- మధ్యప్రదేశ్
మారుతీ భుజరంగ్రావు చిటమ్పల్లి (సాంస్కృతికం, విద్య)- మహారాష్ట్ర
బతూల్ బేగమ్ (జానపద కళాకారిణి) రాజస్థాన్
వేలు ఆసన్ (డప్పు వాద్యకారుడు) తమిళనాడు
భీమవ్వ దొడ్డబాలప్ప శిల్లేక్యాతర (తోలుబొమ్మలాట) – కర్ణాటక
పర్మార్ లాల్జీభాయ్ నాగ్జీభాయ్ (చేనేత)- గుజరాత్
విజయలక్ష్మి దేశ్మానే (వైద్యం)- కర్ణాటక
చైత్రం దేవ్చంద్ పవార్ (పర్యావరణ పరిరక్షణ)- మహారాష్ట్ర
జగదీశ్ జోషిలా (సాహిత్యం)- మధ్యప్రదేశ్
నీర్జా భట్లా (గైనకాలజీ) – దిల్లీ
హ్యూ, కొల్లీన్ గాంట్జర్ (సాహిత్యం, విద్య -ట్రావెల్) ఉత్తరాఖండ్
తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డ్స్ పొందిన ప్రముఖులు
1) డి.నాగేశ్వర రెడ్డి – వైద్యం – తెలంగాణ
2) నందమూరి బాలకృష్ణ – కళలు – ఆంధ్రప్రదేశ్
3) కె.ఎల్ కృష్ణ – లిటరేచర్ – ఆంధ్రప్రదేశ్
4) మాడుగుల నాగఫణి శర్మ – కళలు – ఆంధ్రప్రదేశ్
5) మంద కృష్ణ మాదిగ – పబ్లిక్ ఎఫైర్స్ – తెలంగాణ
6) మిరియాల అప్పారావు(మరణానంతరం) – కళలు – ఆంధ్రప్రదేశ్
7) వద్దిరాజు రాఘవేంద్రాచార్య పంచముఖి – లిటరేచర్, విద్య – ఆంధ్రప్రదేశ్