WAVES | తారలు దిగి వచ్చిన వేళ
దేశాన్ని వరల్డ్ ఎంటర్టైన్ మెంట్ జోన్గా మార్చాలనే సదుద్దేశంతో మొట్టమొదటి సారిగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ‘వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్ మెంట్ సమ్మిట్’ (WAVESummitIndia) ఈవెంట్ మే 1 గురువారం రోజున ముంబయిలో అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హజరయ్యారు.

మే4 వరకు జరుగనున్న ఈ కార్యక్రమంలో కేవలం భారతీయ చిత్రాలు, ఎంటర్ టైన్మెంట్ రంగంలోని పలు విభాగాలపై చర్చించనున్నారు. తొలిరోజు దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి అగ్ర హీరోలు, చిరంజీవి, రజనీకాంత్, మోహన్ లాల్, షారుఖ్ ఖాన్, రాజమౌళి, అక్షయ్ కుమార్, మిథున్ చక్రవర్తి, అలియా భట్, రణబీర్ కపూర్, దీపికీ పదుకునే, రెహమాన్, కీరవాణి వంటి సెలబ్రిటీలెందరో హజరయ్యారు.

X
Google News
Facebook
Instagram
Youtube
Telegram