Site icon vidhaatha

Women’s T20 World Cup | న్యూజీలాండ్​పై ఆసీస్​ ఘనవిజయం – భారత్​ సెమీస్​ ఆశలు సజీవం

ఆస్ట్రేలియా–న్యూజీలాండ్​ల మధ్య జరిగిన లీగ్​ మ్యాచ్​లో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించి సెమీస్​కు దారి సుగమం చేసుకుంది. న్యూజీలాండ్​ను ఘోర పరాభావం(Big defeat for NZ) పాలుజేసి, ఆసీస్​ భారత్​ నెత్తిన పాలు పోసింది. 60 పరుగుల భారీ తేడాతో గెలవడంతో ఆస్ట్రేలియా రన్​రేట్​ +1.908 నుండి  ఎకాఎకిన +2.524కు చేరుకోగా,   కివీస్​ +2.9000 నుండి –0.050కు దారుణంగా పడిపోయింది(NZ NRR big dip). నిజానికి ఆసీస్​ ఓ మోస్తరు తేడాతో గెలిచి ఉంటే, న్యూజీలాండ్​ రన్​రేట్​లో పెద్ద తేడా ఉండేది కాదు. అప్పుడు భారత్​ సెమీస్​ ఆశలు బాగా సన్నగిల్లేవి. కానీ, ఇప్పుడు ఇండియా రన్​రేట్​కు, కివీస్​ రన్​రేట్​కు పెద్ద తేడా లేకపోవడం, పాయింట్లు కూడా సమానంగా రెండే ఉండటం భారత్​కు కలిసొచ్చే అంశం. రేపు శ్రీలంక(Srilanka)తో మ్యాచ్​తో ఆసీస్​లా ఘనవిజయం సాధిస్తే నాలుగు పాయింట్లతో పెరిగిన రన్​రేట్​తో న్యూజీలాండ్​ను అధిగమించే అవకాశం ఉంటుంది. నిజానికి పాకిస్తాన్(Pakistan)​ భారత్​ కన్నా మెరుగైన స్థితిలో ఉంది. వాళ్లు కూడా రెండు పాయింట్లతో, ఎక్కువ రన్​రేట్​తో ఉన్నారు. కానీ, వారికి మిగిలిన రెండు మ్యాచ్​లూ ఆసీస్​, కివీస్​తో ఉన్నాయి. అవి గెలవడం అంత ఈజీ కాదు.

ఇక్కడ ఇంకో మెలిక కూడా ఉంది. న్యూజీలాండ్​కు కూడా శ్రీలంక, పాక్​లతో మ్యాచ్​లు మిగిలే ఉన్నాయి. భారత్​కు శ్రీలంక కాకుండా ఆస్ట్రేలియా పేరున ఓ గండం ఉంది. కివీస్​ ఆ రెండూ గెలిచి (అవకాశాలు చాలా ఎక్కువ), ఇండియా ఆసీస్​ చేతిలో ఓడిపోతే ( దీనికి కూడా అవకాశం ఎక్కువే) ఇంటిముఖం పట్టాల్సిఉంటుంది. ఏదైనా అద్భుతం జరిగి, ఆసీస్​ మన చేతిలో ఓడితే అంతా హ్యాపీ.

 ప్రస్తుతం పరిస్థితి ఇలా ఉంది:

అస్ట్రేలియా    4 పాయింట్లు       +2.524 నె.ర.రే            ఆడాల్సింది: పాక్​, భారత్​

న్యూజీలాండ్ 2 పాయింట్లు       ‌‌–0.050 నె.ర.రే                    ఆడాల్సింది: శ్రీలంక, పాక్​

పాకిస్తాన్​      2 పాయింట్లు       +0.555 నె.ర.రే            ఆడాల్సింది: ఆసీస్​, కివీస్​

భారత్​         2 పాయింట్లు       ‌‌–1.217 నె.ర.రే                   ఆడాల్సింది: శ్రీలంక, ఆసీస్​

శ్రీలంక         0 పాయింట్లు       –1.667  నె.ర.రే           ఆడాల్సింది: భారత్​, కివీస్​

 

ఇలా భారత్​ పరిస్థితి చావు తప్పి కన్ను లొట్టబోయినట్లుగా ఉంది. రేపటి మ్యాచ్​ చాలా చాలా ముఖ్యమైనది. మిగతావారి సంగతెలా ఉన్నా, రన్​రేట్​ను భారీగా పెంచుకునే సువర్ణావకాశం ముందుంది. తూతూ మంత్రం గెలుపు ఏ మాత్రం పనికిరాదు. మొత్తానికి భారత్​ ప్రయాణం రసకందాయంలో పడిన మాట మాత్రం వాస్తవం.

 

Exit mobile version