NASA | అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా మరో సంచలన ప్రాజెక్టును చేపట్టేందుకు సిద్ధమవుతున్నది. భూమి ఉపగ్రమైన చంద్రుడిపై రైళ్లు నడపాలని ప్లాన్ చేస్తున్నది. జాబిల్లి ఉపరితలం అంతటా సమర్థవంతంగా, నమ్మకంగా పేలోడ్ను సులభంగా రవాణా చేయడం లక్ష్యంగా రైల్వే స్టేషన్ నిర్మించి.. రైళ్లను నడపాలని ప్రణాళికలు రచిస్తున్నది.
NASA | అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా మరో సంచలన ప్రాజెక్టును చేపట్టేందుకు సిద్ధమవుతున్నది. భూమి ఉపగ్రమైన చంద్రుడిపై రైళ్లు నడపాలని ప్లాన్ చేస్తున్నది. జాబిల్లి ఉపరితలం అంతటా సమర్థవంతంగా, నమ్మకంగా పేలోడ్ను సులభంగా రవాణా చేయడం లక్ష్యంగా రైల్వే స్టేషన్ నిర్మించి.. రైళ్లను నడపాలని ప్రణాళికలు రచిస్తున్నది. చంద్రుడిపై అన్వేషణలను మరింత విస్తరించడంతో పాటు ఉపరితలంపై క్రియాశీలక స్థావరాలను ఏర్పాటు చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నది.
భూమిపై నడిచే రైళ్ల మాదిరిగా కాకుండా.. చంద్రుడిపై రైల్వే స్టేషన్ల ఏర్పాటుకు ‘ఫ్లెక్సిబుల్ లెవిటేషన్ ఆన్ ఏ ట్రాక్ (Float)’ అనే ప్రత్యేక వ్యవస్థను నాసా తీసుకురాబోతున్నది. ఇందుకు ‘మాగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీ’కి పరిచయం చేసింది. ఫ్లెక్సిబుల్ ఫిల్మ్ ట్రాక్స్ట్రక్చర్పై ఈ టెక్నాలజీని వినియోగిస్తారు. ఫ్లోట్ రోబోలు ట్రాకులపై అన్పవర్డ్ మాగ్నెటిక్ లెవిటేషన్ను ఉపయోగిస్తారు. గాల్లో తెలియాడుతూ దూసుకుపోతాయి. ట్రాక్పై చంద్రుడి దుమ్ము ధూళి రాపిడిని తగ్గించేందుకు ఫ్లోట్ రోబోలను ప్రత్యేకంగా తయారు చేస్తారు.
ట్రాక్ను రైలు తాకకుండా ఈ రోబోలు నిరోధిస్తూ వస్తాయి. దాంతో రైలు సజావుగా తేలుతూ ప్రయాణాలు కొనసాగిస్తాయి. ప్రతిపాదిత ఫ్లోట్ వ్యవస్థ సెకన్కు 0.5 మీటర్ల వేగంతో వివిధ ఆకృతుల పేలోడ్లను రవాణా చేస్తుందని పేర్కొంది. భారీ స్థాయి ఫ్లోట్ వ్యవస్థ రోజుకు లక్ష కిలోల పేలోడ్ను చాలా కిలోమీటర్లకుపైగా దూరం తరలించగదని ఆశాభావం వ్యక్తం చేసింది. దాంతో చంద్రుడిపై స్థావర కార్యకలాపాలను సులభతరం చేస్తుందని అంచనా వేసింది. చంద్రుడిపై నూతన రవాణా పరిష్కారం భూమికి ఆవల జీవం అన్వేషణ, మానవ ఆవాసాల అభివృద్ధిలో గణనీయమైన ముందడుగు నిలుస్తుందని నాసా ఆశాభావం వ్యక్తం చేసింది.