విధాత : తప్ప తాగి పాఠశాలకు వస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడి నిర్వాకం సర్కారీ విద్యా వ్యవస్థ దుస్థితిని చాటింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకపల్లి మండలం తిమ్మంపేట గ్రామ పంచాయితీలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీ టీచరుగా పనిచేస్తున్న పత్తిపాటి వీరయ్య ప్రతిరోజూ మద్యం తాగి పాఠశాలకు రావడం అలవాటుగా మారింది. ఈ క్రమంలో పొద్దున్నే ఫుల్లుగా తాగి నడవలేని స్థితిలో పాఠశాలకు వచ్చి స్కూల్ బయటే పడిపోయాడు. స్పృహలో లేని స్థానికులు అతడిని గమనించి పక్కనే ఉన్న పశువుల కొట్టంలోకి తీసుకెళ్ళి పడుకోబెట్టారు. వీరయ్య మీద చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని స్థానికులు ప్రశ్నించగా, అతడు పాఠశాలకు లేటుగా వచ్చాడు కాబట్టి క్యాజువల్ లీవ్ వేశాం అని స్థానిక హెడ్ మాస్టర్ కిరణ్ చెప్పుకొచ్చాడు. ఒకవైపు సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తామని, ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేస్తామని, ప్రైవేటు రంగానికి ధీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతామని చెబుతుండగా, క్షేత్ర స్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితులున్నాయన్న వాదనకు వీరయ్య ఘటన నిదర్శనంగా నిలిచింది.
తప్పతాగి పాఠశాలకు వస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు … మత్తులో స్కూల్ బయటే పడిపోయిన వైనం
తప్ప తాగి పాఠశాలకు వస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడి నిర్వాకం సర్కారీ విద్యా వ్యవస్థ దుస్థితిని చాటింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకపల్లి మండలం తిమ్మంపేట గ్రామ పంచాయితీలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీ టీచరుగా పనిచేస్తున్న పత్తిపాటి వీరయ్య ప్రతిరోజూ మద్యం తాగి పాఠశాలకు రావడం అలవాటుగా మారింది

Latest News
Toyota Innova Crysta | సరికొత్త లుక్.. అదిరిపోయే ఫీచర్లతో టయోటా ఇన్నోవా క్రిస్టా 2026 మోడల్ లాంచ్.. ధర ఎంతంటే..!
Tecno Pova 8 | 8000mAh భారీ బ్యాటరీతో టెక్నో నుంచి కొత్త స్మార్ట్ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే..!
Credit Card Limit | మీ క్రెడిట్ కార్డు లిమిట్ను బ్యాంకులు అకస్మాత్తుగా తగ్గించేశాయా?
రూ.30వేల కోట్ల విలువైన భూమిని కాపాడాం: హైడ్రా
Parthiban | ఆ మధ్య త్రిషపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు..ఇప్పుడు విజయ్ను కలిసి ప్రత్యేక పెయింటింగ్ బహుకరణ
హైటెక్స్ లో ‘థ్రెడ్ పోచంపల్లి’ప్రదర్శనను ప్రారంభించిన మంత్రులు
హైదరాబాద్లో ఎబోలా కలవరం
సైకిల్తో సవారి.. భవిష్యత్తుకు పచ్చని దారి : చంద్రబాబు
అగ్ని ప్రమాదాల నివారణపై సీఎం సమీక్షించాలి : కవిత
బీజేపీకి అన్నామలై రాజీనామా..తమిళనాట మరో కొత్త పార్టీ