కేయూ ఇన్చార్జి వీసీని కలిసిన ఆకుట్

మంచి అకడమీశీయన్ వీసీగా రాకపోవడం వల్లనే కేయూలో అనేక సమస్యలు తలెత్తాయని వాకాటి కరుణతో అసోసియేషన్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ టీచర్స్ ప్రతినిధులు వివరించారు

కేయూ ఇన్చార్జి వీసీని కలిసిన ఆకుట్

ఏఆర్ అశోక్ బాబు ను ఆ స్థానం నుండి తొలగించాలని డిమాండ్
కాకతీయ యూనివర్సిటీ ఇన్చార్జి వైస్ చాన్సలర్ వాకాటి కరుణను కలిసిన ఆకుట్

విధాత, వరంగల్ ప్రతినిధి: మంచి అకడమీశీయన్ వీసీగా రాకపోవడం వల్లనే కేయూలో అనేక సమస్యలు తలెత్తాయని వాకాటి కరుణతో అసోసియేషన్ ఆఫ్ కాకతీయ యూనివర్సిటీ టీచర్స్ ప్రతినిధులు వివరించారు. కాకతీయ యూనివర్సిటీ ఇన్చార్జి వైస్ చాన్సలర్ వాకాటి కరుణను బుధవారం ఆకుట్ ప్రతినిధులు కలిసి వివరించారు. వాకాటి కరుణ కేయూ లో వున్న సమస్యల గురుంచి ఆకుట్ సభ్యులను అడిగి తెలుసుకొన్నారు.

ఈ సందర్భంగా ఆకుట్ సభ్యులు మాట్లాడుతూ ముఖ్యంగా కేయూ భూములను కబ్జా చేసిన వారిని అసిస్టెంట్ రిజి స్ట్రార్ గా పెట్టుకొని, రిటైర్ అయిన రిజిస్ట్రార్ ను యూ నివర్సిటీ చట్టానికి విరుద్ధంగా నియామకం చేసుకొని మాజీ వీసీ అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని వివరించారు. విజిలెన్స్ విచారణకు అదేశించాక వీసీ లాడ్జి నుండి ఫైళ్లు మాయం చేశారని వివరించామని ఆకుట్ ప్రతినిధి తెలిపారు.

విజిలెన్స్ విచారణలో వున్న అంశాలపై కొందరు టీచర్లు, అసిస్టెంట్ రిజిస్ట్రార్ లు మిగితా కొందరు టీచర్లను తప్పు దోవ పట్టిస్తున్నారని తెలిపా రు. ఇటీవల అక్రమంగా నియమించిన పాలన పదవు లను, టీచర్ల బదిలీలను రద్దు చేయాలని, మంచి అకా డేమిక్ వాతావరణం కేయూలో నెలకొల్పడానికి ఆకుట్ సహకరిస్తుందని చెప్పామని అన్నారు. ల్యాండ్ కమిటీ నుండి తొలగింపబడి భూకబ్జా దారుడిగా ఆరోపణలు ఎదుర్కుంటున్న అసిస్టెంట్ రిజిస్ట్రార్ పెండ్లి అశోక్ బాబును ఆ స్థానం నుండి తొలగించాలని తెలిపామని అన్నారు.

అకాడమిక్ విషయాలలో వున్న సమస్యల ను తీర్చడానికి సిద్ధంగా ఉన్నానని ఈ సమస్యలన్నిం టినీ ప్రాధాన్యత క్రమంలో అకుట్ ద్వారా తెలియచేస్తే అన్నిటినీ పరిష్కరిస్తానని తెలిపారని అన్నారు. ఇన్చా ర్జి వైస్ చాన్సలర్ వాకాటి కరుణను కలిసిన వారిలో ఆకుట్ అధ్యక్షులు ప్రో. టీ. శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ డా మామిడాల ఇస్తారి, ఉపాధ్యక్షులు ప్రో. జీ. బ్రహ్మేశ్వ రి, జాయింట్ సెక్రటరీ డా. కే కిషోర్ కుమార్, ఈసీ మెంబర్లు డా.డీ. రమేష్, డా ఎన్. సుదర్శన్ లు ఉన్నారు.