Site icon vidhaatha

Raghunandan Rao | మెదక్ బీఆరెస్ ఎంపీ అభ్యర్థిపై కేసు పెట్టాలి

డీజీపీకి బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఫిర్యాదు

విధాత: మెదక్ బీఆరెస్ ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ పి. వెంకట్రామ్‌రెడ్డిపై కేసు రిజిస్టర్ చేయాలని బీజేపీ ఎంపీ అభ్యర్తి, మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు శనివారం హైదరాబాద్ డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ నెంబర్ 243/2024 కేసులో అరెస్ట్ అయిన పోలీస్ అధికారి రాధాకిషన్ రావు మార్చి 9న ఇచ్చిన వాంగ్మూలంలోని పేజీ నెంబర్ 5, 6, 7లో వెంకట్రాంరెడ్డికి తను సన్నిహితుడినని తెలిపారని, వెంకట్రామ్‌రెడ్డి రాజ పుష్పా కన్స్ట్రక్షన్స్ యాజమానులైనా అయన సోదరులు వ్యాపారుల నుంచి వసూలు చేసిన డబ్బులను ఎస్ఐ ద్వారా ప్రభుత్వ వాహనాల్లో తరలించినట్లు అందులో తెలిపారని ఫిర్యాదులో పేర్కోన్నారు.

రాధాకిషన్ రావు చెప్పిన ప్రకారమే తాను ఆ డబ్బును తరలించినట్లు ఎస్ఐ సాయి కిరణ్ 161(3) కింద స్టేట్మెంట్ ఇచ్చిన విషయాన్ని రఘునందన్ రావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. రాధాకిషన్ రావు 9 మార్చి నాడు ఇచ్చిన వాంగ్మూలంలో వెంకట్ రాం రెడ్డి, రాజపుష్ప కన్స్ట్రక్షన్స్ యజమానులు బీఆరెస్‌కు ఫండ్స్ ఇస్తుందని వివరించినట్లు రఘునందన్ రావు ఫిర్యాదులో పొందుపరిచారు. ఈ మేరకు వెంకట్రామ్‌రెడ్డి పలు చట్ట వ్యతిరేక వ్యవహారాలు చేశాడని, అప్పటి సీఎం కేసీఆర్ వారి కుటుంబ సభ్యులతో సన్నిహితంగా తనను ఏ చట్టం ఏమి చేయదనే తీరుతో నాన్ బెయిలబుల్ కేసులలో తప్పించుకున్నాడని రఘునందన్ రావు డీజీపీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కోన్నారు.

రాధాకిషన్ రావు, ఎస్ఐ సాయి కిరణ్ వాంగ్మూలం, స్టేట్మెంట్ లను ఫిర్యాదుకు జత చేసినట్లుగా తెలిపారు. వెంకట్రామ్‌రెడ్డి జోలికి ఎవరు వెళ్ళలేరనే తీరుతో ఆయన ప్రవర్తిస్తున్నాడని రఘునందన్ రావు ఆరోపించారు. గతంలో ఆయనపై ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని రఘు నందన్ రావు విమర్శించారు. మంత్రి పొంగులేటికి వియ్యంకుడైనందునే ఆయనపై పోలీసులు కేసు నమోదు చేయడం లేదా అని ప్రశ్నించారు. ఇకనైనా వెంకట్రామ్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, నిర్మాణ, వ్యాపార సంస్థలు లావాదేవిలపై ఫ్రత్యేక ఐపీఎస్ అధికారిని నియమించి విచారణ జరిపించాలని రఘునందన్‌రావు తన ఫిర్యాదులో డిమాండ్ చేశారు.

Exit mobile version