KTR | పిచ్చోడి చేతిలో రాయిలాగా తెలంగాణలో పరిపాలన
పిచ్చోడి చేతిలో రాయిలాగా మారింది తెలంగాణలో పరిపాలన అంటూ బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వంపై ట్విటర్ వేదికగా మండిపడ్డారు

రాష్ట్ర గీతంపై సీఎం రేవంత్రెడ్డి తీరుపై కేటీఆర్ ట్వీట్
విధాత : పిచ్చోడి చేతిలో రాయిలాగా మారింది తెలంగాణలో పరిపాలన అంటూ బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వంపై ట్విటర్ వేదికగా మండిపడ్డారు. తెలంగాణ అధికారిక చిహ్నంపై సీఎం రేవంత్రెడ్డి తీరును కేటీఆర్ తప్పుబడుతూ ట్విటర్లో తన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రముఖ కళాకారుడు అలె లక్ష్మణ్ తయారు చేసిన రాష్ట్ర రాజముద్రలో తెలంగాణ చరిత్రకి, సాంస్కృతిక వారసత్వానికి, గంగా-జమునా తహజీబుకి ప్రతీకలైన కాకతీయ తోరణం, చార్మినార్ ఉంటె అది రాచరిక పోకడనా అని పశ్నించారు. కానీ అదే రాష్ట్ర గీతంలో మాత్రం అదే చార్మినార్ గురించి “గోల్కొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్“ అని పాడుకోవాలి !!??
“కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప” అని అదే రాచరిక పరిపాలన గురించి ప్రస్తుతించాలి !!?? ఇదేం భిన్న వైఖరులంటూ ప్రశ్నించారు. అసలు ముఖ్యమంత్రికి గాని, ఆయన మంత్రిమండలిలో ఒక్కరికైనా రాష్ట్రగీతంలో ఏమున్నదో తెలుసా ? అని ప్రశ్నించారు.