Konda Lakshma Reddy | కొండా లక్ష్మారెడ్డి మృతిపై సీఎం, డిప్యూటీ సీఎం సంతాపం

చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మా రెడ్డి మృతిపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంతాపం. ఆయన సేవలను కొనియాడారు.

Konda Lakshma Reddy | కొండా లక్ష్మారెడ్డి మృతిపై సీఎం, డిప్యూటీ సీఎం సంతాపం

హైదరాబాద్, అక్టోబర్ 13(విధాత): చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మా రెడ్డి మృతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంతాపం వ్యక్తం చేశారు. ఎన్ఎస్ఎస్ వార్తా ఏజెన్సీ స్థాపకుడిగా, శాసన సభ్యుడిగా, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా, జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ప్రెసిడెంట్ గా ఆయన సేవలందించారని సీఎం కొనియాడారు. ఆయన మృతి కాంగ్రెస్ పార్టీకి తీరనిలోటని, లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

కాంగ్రెస్ పార్టీలో లక్ష్మారెడ్డి పలు హోదాల్లో పని చేశారని డిప్యూటీ సీఎం భట్టి గుర్తు చేసుకున్నారు. ప్రధానంగా ఆ ధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ అధ్యక్షులుగా, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ గ్రీవెన్స్ సెల్ అధికార ప్రతినిధిగా సేవ‌లు అందించార‌న్నారు. ల‌క్ష్మారెడ్డి మృతి కాంగ్రెస్ పార్టీతో పాటు పాత్రికేయ రంగానికి తీర‌ని లోట‌ని భ‌ట్టి చెప్పారు.