విధాత, ప్రత్యే క ప్రతినిధి:
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అమెరికాలోని హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ నుంచి అరుదైన ఆహ్వానం అందింది. హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ తొలిసారిగా నిర్వహిస్తున్న ఏఐ పాలసీ సింపోజియంలో ప్రసంగించాలని నిర్వాహకులు సీఎంకు ఆహ్వాన లేఖను పంపించారు. ఈ ఏడాది మార్చి 27న హార్వర్డ్ స్కూల్ క్యాంపస్లోనే ఈ కార్యక్రమం జరుగనుంది. భారత్ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి ఒక్కరే ఈ సింపోజియం ఆహ్వానం అందుకోవటం విశేషం. ఈ సింపోజియంలో “AI as Infrastructure & Compute Power: Impact on Livability & Workforce” అనే ప్యానెల్లో ప్రసంగించాలని సీఎంను ఆహ్వానించారు. ఈ సెషన్లో డేటా సెంటర్లు, ఎనర్జీ సిస్టమ్స్, కంప్యూట్ కారిడార్స్ ప్రభావంపై ప్రధానంగా చర్చ జరగనుంది. ఏఐ ఎకోసిస్టమ్ అభివృద్ధి, ఏఐ సిటీ అభివృద్ధి లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, భూమి, విద్యుత్, నైపుణ్యాలు, నియంత్రణ, పెట్టుబడుల భాగస్వామ్యం వంటి అంశాలపై ప్రసంగించాలని సీఎంను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఇటీవల అమెరికా పర్యటనలో నిర్వాహకులు సీఎంను ప్రత్యేకంగా కలిసి సింపోజియంపై చర్చించారు. ప్రభుత్వం, పరిశ్రమ, అకాడమి రంగాల ప్రముఖులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, ఏఐ పాలసీ, జియోపాలిటిక్స్, నాలెడ్జ్ ఎకానమీ, ఎనేబ్లింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంశాలపై చర్చించేందుకు ఈ సింపోజియం నిర్వహిస్తున్నట్లు వివరించారు.
హార్వర్డ్ నుంచి సీఎం రేవంత్కు అరుదైన ఆహ్వానం.. మార్చి 27న హర్డర్డ్ స్కూల్ క్యాంపస్లో సింపొజియం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అమెరికాలోని హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ నుంచి అరుదైన ఆహ్వానం అందింది. హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ తొలిసారిగా నిర్వహిస్తున్న ఏఐ పాలసీ సింపోజియంలో ప్రసంగించాలని నిర్వాహకులు సీఎంకు ఆహ్వాన లేఖను పంపించారు.

Latest News
ఇది మీ ఇండియా కాదు.. రోడ్డుపై గుట్కా ఉమ్మేసిన టూరిస్ట్ను కడిగిపారేసిన నేపాలీ.. వీడియో వైరల్
స్పెయిన్లో మంచి జాబ్.. ఫ్రీగా ఇల్లు.. బంపరాఫర్ పొందాలంటే ఆ ఒక్కటే కండీషన్!
రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు
స్వల్పంగా పెరిగిన బంగారం..స్థిరంగా వెండి !
కారుపై పడిన సిమెంట్ ట్యాంకర్..ఒకరి మృతి
త్వరలో డిజిటల్ మీడియా ప్రారంభిస్తున్నా: విజయసాయిరెడ్డి ట్వీట్
స్టార్ హీరోయిన్ ఇలియానాని ఎందుకు బ్యాన్ చేశారు..
నాదర్ గుల్ భూముల్లో బౌన్సర్లను ఉరికించి కొట్టిన రైతులు!
వైభవ్ విధ్వంసానికి కోహ్లీ ఫిదా.. మ్యాచ్ తర్వాత స్పెషల్ గిఫ్ట్
అమీన్ పూర్ లో హైడ్రా కూల్చివేతలు..ఉద్రిక్తత