CM Revanth Reddy | మూడు పార్టీలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

సీఎం రేవంత్‌రెడ్డి శనివారం సీపీఐ, సీపీఎం, తెలంగాణ జనసమితి నేతలతో భేటీ అయ్యారు. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, చివరి రోజు ప్రచార సరళిపై చర్చించారు

  • Publish Date - May 25, 2024 / 12:26 PM IST

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై చర్చ

విధాత: సీఎం రేవంత్‌రెడ్డి శనివారం సీపీఐ, సీపీఎం, తెలంగాణ జనసమితి నేతలతో భేటీ అయ్యారు. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక, చివరి రోజు ప్రచార సరళిపై చర్చించారు. ఈ ఉప ఎన్నికలో ఈ నెల 27న పోలింగ్ జరుగనున్న నేఫథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపుకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ సమావేశానికి ఆయా పార్టీలకు చెందిన ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ విశ్వేశ్వర్ రావు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జూలకంటి రంగారెడ్డి, ఎస్.వీరయ్య, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మల్లు రవి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, బొంతు రామ్మోహన్, తదితరులు పాల్గొన్నారు.

Latest News