మా పోటీ సింగపూర్, టోక్యో, న్యూయార్క్తో: సీఎం రేవంత్ రెడ్డి
మా పోటీ ఇతర రాష్ట్రాల నగరాలతో కాదు.. మా పోటీ సింగపూర్, టోక్యో, న్యూయార్క్ నగరాలతోనని, ఇందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హోటల్ ITC కోహినూర్ లో దక్షిణ–పశ్చిమ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్స్ రీజనల్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..
హైదరాబాద్, నవంబర్ 18(విధాత): మా పోటీ ఇతర రాష్ట్రాల నగరాలతో కాదు.. మా పోటీ సింగపూర్, టోక్యో, న్యూయార్క్ నగరాలతోనని, ఇందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం అవసరమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హోటల్ ITC కోహినూర్ లో దక్షిణ–పశ్చిమ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్స్ రీజనల్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ ఎకానమీలో 10 శాతం ఎకానమీని తెలంగాణ నుంచి అందించాలని భావిస్తున్నాం, హైదరాబాద్ నగర అభివృద్ధితోపాటు మేం భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయబోతున్నాం, రాష్ట్రంలో డ్రై పోర్టు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.
ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం భారత దేశమని అన్నారు. వికసిత్ భారత్ 2047 అనుగుణంగా 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా దేశాన్ని తీర్చిదిద్దాలని ప్రధాని మోదీ పనిచేస్తున్నారన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కేంద్ర మంత్రి ఖట్టర్ ని కోరుతున్నామన్నారు.
వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన అనుమతులు వేగంగా జారీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా, మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్, గోదావరి జలాల తరలింపు, మూసీ ప్రక్షాళనతో పాటు వివిధ అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వ సహకారం ఉండాలన్నారు. రాబోయే ఏడాదిలో 3 వేల ఎలక్ట్రిక్ బస్సులను హైదరాబాద్ నగరంలో తీసుకురావాలని ప్రణాళికలు వేస్తున్నామన్నారు. డిసెంబర్ 9 న తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ విడుదల చేయబోతున్నామని, 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. ఈ సమావేశానికి హాజరైన కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, ఏపీ మంత్రి పొంగూరు నారాయణ, గుజరాత్ మంత్రి కనుభాయ్ మోహన్ లాల్ దేశాయ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram