విధాత, హైదరాబాద్ : 2లక్షల రైతు రుణమాఫీకి సంబంధించి సీఎం రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కల్వకుర్తిలో మాజీ కేంద్ర మంత్రి దివంగత సూదిని జైపాల్రెడ్డి ఐదో వర్ధంతి సందర్భంగా విగ్రహావిష్కరణ చేసి బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా రైతు రుణమాఫీపై మాట్లాడుతూ రైతు రుణమాఫీలో ఇప్పటికే 1లక్ష వరకు రుణమాఫీ పూర్తి చేశామని, జూలై 31 లోపు రెండో విడత కింద రూ.1లక్ష 50వేల రుణమాఫీ చేసి రైతు రుణం తీర్చుకుంటామని కల్వకుర్తి గడ్డ మీద నుంచి మాట ఇస్తున్నాన్నారు. అయితే ఆగస్ట్ 2 నుండి 14 వరకు విదేశీ పర్యటనకు వెళ్తున్నానని.. నేను తిరిగి వచ్చాక ఆగస్ట్ నెలలోనే 2 లక్షల రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. దీంతో 2లక్షల రుణమాఫీ ఇంతకుముందు సీఎం రేవంత్రెడ్డి చెప్పినట్లుగా ఆగస్టు 15వ తేదీలోగా పూర్తవుతుందా లేదా అన్నదానిపై సర్వత్రా సందేహాలు నెలకొన్నాయి. అయితే మొత్తం మీద ఆగస్టు నెలలోనే 2లక్షల రుణమాఫీ పూర్తవుతుందన్న భరోసా మాత్రం మిగిలింది.
CM Revanth Reddy | ఆమెరికా నుంచి వచ్చాకే 2లక్షల రూణమాఫీ … సీఎం రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు
2లక్షల రైతు రుణమాఫీకి సంబంధించి సీఎం రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కల్వకుర్తిలో మాజీ కేంద్ర మంత్రి దివంగత సూదిని జైపాల్రెడ్డి ఐదో వర్ధంతి సందర్భంగా విగ్రహావిష్కరణ చేసి బహిరంగ సభలో ప్రసంగించారు.

Latest News
ఒక్కసారి ఫుల్ చార్జింగ్ చేస్తే 34 గంటలు ఫోన్ మాట్లాడొచ్చు.. రియల్మీ నుంచి సరికొత్త 5జీ మొబైల్!
దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యంతో ఆడుకుంటే తీవ్ర తిరుగుబాటు.. కేంద్రానికి కేటీఆర్ హెచ్చరిక
వ్యవసాయ మార్కెటింగ్ సమస్యలపై రాష్ట్ర స్థాయి వర్క్షాప్ విజయవంతం
అనుకున్నంతా అయింది : ఏప్రిల్ 30 నుండి.. జూన్కు 'పెద్ది'
బీజీపీకి లాభం.. ప్రతిపక్షాలకు నష్టం.. : పెరిగే సీట్లపై యోగేంద్రయాదవ్ విశ్లేషణ
మహిళా రిజర్వేషన్లకు సై..డీలిమిటేషన్ కు నో : ఖర్గే ప్రకటన
నీటి భద్రత కోసం జలధార యాక్షన్ ప్లాన్ : సీఎం చంద్రబాబు
సీట్ల పెంపుతో దక్షిణాది రాష్టాల వాట పదిలం : ఎంపీ లక్ష్మణ్
దక్షిణాదిపై డీలిమిటేషన్ బాంబు.. మహిళా రిజర్వేషన్ ముసుగులో కేంద్రం అత్యుత్సాహం
పవన్,నిహారికలపై అనుచిత వ్యాఖ్యలు..