విధాత, హైదరాబాద్ : 2లక్షల రైతు రుణమాఫీకి సంబంధించి సీఎం రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కల్వకుర్తిలో మాజీ కేంద్ర మంత్రి దివంగత సూదిని జైపాల్రెడ్డి ఐదో వర్ధంతి సందర్భంగా విగ్రహావిష్కరణ చేసి బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా రైతు రుణమాఫీపై మాట్లాడుతూ రైతు రుణమాఫీలో ఇప్పటికే 1లక్ష వరకు రుణమాఫీ పూర్తి చేశామని, జూలై 31 లోపు రెండో విడత కింద రూ.1లక్ష 50వేల రుణమాఫీ చేసి రైతు రుణం తీర్చుకుంటామని కల్వకుర్తి గడ్డ మీద నుంచి మాట ఇస్తున్నాన్నారు. అయితే ఆగస్ట్ 2 నుండి 14 వరకు విదేశీ పర్యటనకు వెళ్తున్నానని.. నేను తిరిగి వచ్చాక ఆగస్ట్ నెలలోనే 2 లక్షల రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. దీంతో 2లక్షల రుణమాఫీ ఇంతకుముందు సీఎం రేవంత్రెడ్డి చెప్పినట్లుగా ఆగస్టు 15వ తేదీలోగా పూర్తవుతుందా లేదా అన్నదానిపై సర్వత్రా సందేహాలు నెలకొన్నాయి. అయితే మొత్తం మీద ఆగస్టు నెలలోనే 2లక్షల రుణమాఫీ పూర్తవుతుందన్న భరోసా మాత్రం మిగిలింది.
CM Revanth Reddy | ఆమెరికా నుంచి వచ్చాకే 2లక్షల రూణమాఫీ … సీఎం రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు
2లక్షల రైతు రుణమాఫీకి సంబంధించి సీఎం రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కల్వకుర్తిలో మాజీ కేంద్ర మంత్రి దివంగత సూదిని జైపాల్రెడ్డి ఐదో వర్ధంతి సందర్భంగా విగ్రహావిష్కరణ చేసి బహిరంగ సభలో ప్రసంగించారు.

Latest News
12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు