సీఎం రేవంత్రెడ్డి రేపో ఎల్లుండో బీజేపీలోకి వస్తాడంట అని నిజమాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి, సిటింగ్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
విధాత, హైదరాబాద్ : సీఎం రేవంత్రెడ్డి రేపో ఎల్లుండో బీజేపీలోకి వస్తాడంట అని నిజమాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి, సిటింగ్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన ఈరోజు కాంగ్రెస్ నుంచి ఆల్ ఇండియా సోషల్ మీడియా హెడ్ బీజేపీలో చేరిందని, నిన్న మిలింద్, మొన్న జిందాల్, అంతకు ముందు చౌహన్ బీజేపీలోకి వచ్చారని చెప్పుకొచ్చారు. ఆ క్రమంలో సీఎం రేవంత్రెడ్డి కూడా రేపో ఎల్లుండో బీజేపీకి లోకి వస్తాడంటూ వ్యాఖ్యానించారు. ఎంపీ అర్వింద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి.