మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తన ఎన్నికల ప్రచారంతో కాలనీలు..అపార్ట్మెంట వాసులతో మమేకమవుతూ దూసుకెలుతున్నారు.
కాలనీలు..అపార్ట్మెంట్ వాసులతో మమేకం
విధాత, హైదరాబాద్: మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తన ఎన్నికల ప్రచారంతో కాలనీలు..అపార్ట్మెంట వాసులతో మమేకమవుతూ దూసుకెలుతున్నారు. ఒకవైపు ఇంటింటి ప్రచారం చేస్తునే.. ఇంకోవైపు కాలనీలు..అపార్ట్మెంట్ వాసులతో సమావేశమవుతూ తనను ఎందుకు గెలిపించాలో వివరిస్తూ ఓటర్లను తనకు ఓటు వేయాలని అభ్యర్థిస్తు వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. శుక్రవారం కూకట్ పల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని “ఇందు ఫార్చ్యూన్ అపార్ట్మెంట్” వాసులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ లోక్ సభ ఎన్నికలలో దేశానికి సుస్థిర, సుపరిపాలన అందిస్తున్న ప్రధాని నరేంధ్ర మోదీ నాయకత్వాన్ని బలపరుస్తూ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. దేశ వ్యాప్తంగా మోదీకి లభిస్తున్న ప్రజాదరణతో కేంద్రంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందన్నారు. మల్కాజిగిరి ఎంపీగా తనను గెలిపించిన పక్షంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గం అభివృద్ధికి నిధులు సాధించుకోగలుతామని, ఇది మోదీ గ్యారంటీ అని చెప్పారు. తనకు మద్దతు తెలిపిన ఇందు ఫార్చ్యూన్ అపార్ట్మెంట్ వాసులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్రంలో బీఆరెస్ పని అయిపోయిందని, కాంగ్రెస్ మోసపూరిత హామీలతో ప్రజలను మభ్యపెట్టి, ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. బీజేపీని అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ రాజ్యంగం రద్ధు..రిజర్వేషన్లు రద్ధు అంటు దుష్ప్రచారానికి దిగుతుందని తప్పుబట్టారు. డాక్టర్ బీఆరెస్ అంబేద్కర్కు భారత రత్న ప్రధానోత్సవంతో గౌరవించిన ప్రధాని మోదీ పాలనతోనే అన్ని వర్గాల వారికి రాజ్యంగ ఫలాలు అందుతాయన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను ఎలాంటి నష్టం ఉండబోదని, ఆ వర్గాల అభున్నతికి మోదీ పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక నాయకులు వోడేపల్లి రాజేశ్వర్ రావు, కాంత రావు, ప్రితం, సుమన్ , జగన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.