ఏపీ మాజీ సీఎం జగన్‌ లోటస్‌ పాండ్‌ ఆక్రమణల కూల్చివేత

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాసం హైదరాబాద్‌లోని లోటస్‌ పాండ్‌ భవనం వద్ద అక్రమ నిర్మాణాలను శనివారం జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చివేశారు.

ఏపీ మాజీ సీఎం జగన్‌ లోటస్‌ పాండ్‌ ఆక్రమణల కూల్చివేత

అధికార మార్పిడి కాగానే మొదలైన చర్యలు

విధాత, హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాసం హైదరాబాద్‌లోని లోటస్‌ పాండ్‌ భవనం వద్ద అక్రమ నిర్మాణాలను శనివారం జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చివేశారు. లోటస్‌పాండ్‌ వద్ద ఇంటి ఆవరణలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి సెంట్రీని నిర్మించారు. ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణం చేసినందున శనివారం జీహెచ్ఎంసీ అధికారులు దాన్ని కూల్చివేశారు. నిబంధనలకు విరుద్ధంగా సెంట్రీని నిర్మించినందుకే దాన్ని కూల్చివేశామని అధికారులు చెప్పారు.


కాగా, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ గెలిచి రెండు వారాలు కూడా కాకముందే ఈ పరిణామం చోటుచేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచన మేరకే తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి జగన్‌ ఇంటి దగ్గరి సెంట్రీని కూల్చివేయించారని వాదనలు వినిపిస్తున్నాయి. రేవంత్‌ అధికారంలోకి వచ్చి ఆరు నెలలైనా ఆ అక్రమ నిర్మాణం ఊసే ఎత్తలేదని, ఇప్పుడు చంద్రబాబు ఏపీ సీఎం కాగానే ఏకంగా ఆ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారని విమర్శలు వస్తున్నాయి.