బీఆరెస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అయోధ్య రామమందిరం సందర్శించారు. బాలరాముడిని దర్శనం చేసుకున్న మల్లారెడ్డి సంబంధిత ఫోటోలను ట్వీట్ చేశారు
విధాత: బీఆరెస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అయోధ్య రామమందిరం సందర్శించారు. బాలరాముడిని దర్శనం చేసుకున్న మల్లారెడ్డి సంబంధిత ఫోటోలను ట్వీట్ చేశారు. రాజకీయాల్లో తనదైన పంచ్ మార్క్ డైలాగ్లతో ఆకట్టుకునే మల్లారెడ్డి తన కళాశాలల కార్యక్రమాల్లో డ్యాన్స్లు, స్పీచ్లతో అదరగొడుతు…గోవా బీచ్లో షికారు చేస్తూ నా రూటే స్పెషల్ అంటూ సందడి చేస్తుంటారు. ఈ దఫా ఆధ్యాత్మిక మార్గం పట్టి బాలరాముడిని దర్శించుకుని దండం పెడుతూ తన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడం విశేషం.