TELANGANA | హామీలలోనే కాదు..అసెంబ్లీ సమావేశాల్లోనూ ఎగవేతనే … ప్రభుత్వంపై మాజీ మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి ఫైర్‌

అధికార కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకిచ్చిన ఎన్నికల హామీలలో ఎగవేతనే కాదు ..ఆసెంబ్లీ సమావేశాల సమయం పైన కూడా ఎగవేత ధోరణి అవలంభిస్తోందని మాజీ మంత్రులు టి.హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డిలు విమర్శించారు.

TELANGANA | హామీలలోనే కాదు..అసెంబ్లీ సమావేశాల్లోనూ ఎగవేతనే … ప్రభుత్వంపై మాజీ మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి ఫైర్‌

15రోజులు సమావేశాలు జరుపాలని డిమాండ్‌
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం చేసిన బీజేపీ

విధాత, హైదరాబాద్ : అధికార కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకిచ్చిన ఎన్నికల హామీలలో ఎగవేతనే కాదు ..ఆసెంబ్లీ సమావేశాల సమయం పైన కూడా ఎగవేత ధోరణి అవలంభిస్తోందని మాజీ మంత్రులు టి.హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డిలు విమర్శించారు. బీఏసీ సమావేశం అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ ప్రశాంత్‌రెడ్డితో కలిసి హరీశ్‌రావు మాట్లాడారు. బడ్జెట్ సమావేశాలు నాలుగు రోజులు కుదిస్తున్నారని, కనీసం 15 రోజులు సమావేశాలు జరపాలని డిమాండ్ చేశారు. డిమాండ్లపై రెండు రోజులే చర్చకు అవకాశమివ్వడం దారుణమని, గతంలో కేసీఆర్ హయంలో తొమ్మిది రోజులు డిమాండ్ల పై చర్చ జరిగేదని గుర్తు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నపుడు అసెంబ్లీ సమావేశాల పని దినాలు పెంచాలన్న కాంగ్రెస్ ఇపుడు ఎం చేస్తోందని ప్రశ్నించారు. పాలక పక్షం దుర్మార్గంగా ప్రవర్తిస్తుందని, రేపటి ఎజెండా ఇంకా ఖరారు చేయలేదని ప్రభుుత్వం చెప్పిందని, ఈ సాయంత్రం రేపటి చర్చను నిర్ణయిస్తే సభ్యులు ఎలా సిద్ధమవుతారని ప్రభుత్వాన్ని నిలదీశారు. నిరుద్యోగుల అంశంపై రేపు చర్చా చేపట్టాలన్నామని, తొమ్మిది అంశాలను చర్చకు ప్రతిపాదించామని తెలిపారు. శాంతి భద్రతల వైఫల్యం ,చేనేత కార్మికుల ఆత్మహత్యలు ,గ్యారంటీలు చట్టబద్ధత ,రైతు రుణమాఫీ ఆంక్షలు ,అన్ని పంటలకు బోనస్ రైతు భరోసా, పల్లె లు పట్టణాల్లో పారిశుధ్య లోపం స్థానిక సంస్తలకు నిధులు, ఫీజు రీఎంబర్స్ మెంట్ చెల్లింపులు ,గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులకు పెండింగ్ బిల్లులు లాంటి తొమ్మిది అంశాలు చర్చను పెట్టాలని కోరామని వెల్లడించారు.

ఇక కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ అనే పదమే ఉచ్ఛరించలేదని, కాంగ్రెస్ బీజేపీలు కలిసి తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయని హరీశ్‌రావు మండిపడ్డారు. ఏపీ వెనుకబడిన జిల్లాల గురించి మాట్లాడారని, తెలంగాణలో వెనుకబడిన జిల్లాలు లేవా అని ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా లేదని, కిషన్ రెడ్డి , బండి సంజయ్ ఏం చేస్తున్నారని,.ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు తెలంగాణ నుంచి గెలిచి ఏం ప్రయోజనమని మండిపడ్డారు. ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏదీ ,బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ ప్రస్తావని లేదని, తెలంగాణకు బీజేపీ బడ్జెట్‌లో తీరని అన్యాయం చేసిందని, తెలంగాణ కు కేంద్రం ఇచ్చింది గుండు సున్నా అని విమర్శించారు.