Harish Rao : సీఎం జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో..రైతులు చలిలో క్యూలైన్లలో

సీఎం రేవంత్ రెడ్డి ప్యాలెస్‌లో ఉంటే, రైతులు చలిలో యూరియా కోసం క్యూలో ఉన్నారని హరీష్ రావు మండిపడ్డారు. ప్రభుత్వం తెచ్చిన యూరియా యాప్ ఏమైందని ఆయన నిలదీశారు

Harish Rao : సీఎం జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో..రైతులు చలిలో క్యూలైన్లలో

విధాత, హైదరాబాద్ : యూరియ సమస్యపై బీఆర్ఎస్ మాజీ మంత్రి టి.హరీష్ రావు ఎక్స్ వేదికగా ప్రభుత్వం వైఖరిపై మండిపడ్డారు. సావు భాష తప్ప సాగు గురించి సోయి లేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే రైతుల బతుకులు ఇలా క్యూ లైన్లలో తెల్లారాల్సిందేనంటూ రైతులు యూరియా కోసం తెల్లవారుజామున చలిలో క్యూలైన్లలో ఉన్న ఫోటోలను, వీడియోలను పోస్టు చేశారు. “అందరినీ తొక్కుకుంటూ వచ్చాను” అని గర్వంగా చెప్పుకునే రేవంత్ రెడ్డి, నీ చెత్త పాలనతో ఇప్పుడు రైతులనే తొక్కుతున్నావు అంటూ హరీష్ రావు విమర్శించారు. నీ చిల్లర రాజకీయాలకు, నీ విధ్వంసకర పాలనకు బలైపోతున్నది రైతేనని..రైతులకు సమయానికి యూరియా కూడా అందించలేని నువ్వు ముఖ్యమంత్రివా? అంటూ ప్రశ్నించారు.

యూరియా కొరత కనిపించకుండా మసిపూసి మారేడుకాయ చేయడానికి తెచ్చిన నీ యూరియా యాప్ ఏమైంది? అని నిలదీశారు. యాసంగి సీజన్ ఆరంభంలోనే రైతులకు యూరియా కష్టాలు మొదలైతే, మీ ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? అని ప్రశ్నించారు. మీరు జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో కూర్చుంటే, రైతులు మాత్రం తెల్లవారుజాము నుంచే ఎముకలు కొరికే చలిలో చెప్పులు క్యూలో పెట్టుకుని యూరియా కోసం ఎదురు చూస్తున్నారన్నారు. ఇదేనా మీరు చెప్పిన “మార్పు” అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. గత సీజన్‌లో ఎదురైన యూరియా కొరత చేదు అనుభవాల నుంచి కూడా మీ ప్రభుత్వం ఏమీ నేర్చుకోలేదా? అని, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత కాలం తెలంగాణలో యూరియా సమస్య తీరదా? అని హరీష్ రావు ఆగ్రహం వెలిబుచ్చారు.

ఇవి కూడా చదవండి :

Raithu Bharosa payments| రైతుల ఖాతాల్లోకి “భరోసా” డబ్బులు..సంక్రాంతికే!
Two Girls Love Marriage | ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇద్ద‌ర‌మ్మాయిలు.. గ్యాస్ స్ట‌వ్ చుట్టూ ఏడ‌డుగులు..!