Harish Rao | మానుకోటకు 14ఏళ్లు.. యాదిలోకి ఆనాటి చారిత్రాక సన్నివేశం: హరీశ్రావు
మలిదశ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న వేళ.. మానుకోట ఘటన ఓ చారిత్రాత్మక సందర్భం.. తెలంగాణ ఉద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఆ సంఘటన జరిగి నేటికి 14ఏండ్లు అవుతుందని గుర్తు చేస్తూ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ట్వీట్ చేశారు

విధాత: మలిదశ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న వేళ.. మానుకోట ఘటన ఓ చారిత్రాత్మక సందర్భం.. తెలంగాణ ఉద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఆ సంఘటన జరిగి నేటికి 14ఏండ్లు అవుతుందని గుర్తు చేస్తూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ట్వీట్ చేశారు. ఆధిపత్య అహంకారంతో తుపాకులు ఎక్కుపెట్టిన అప్పటి పాలకులకు మానుకోట రాళ్లే సమాధానం చెప్పాయని, తుపాకీ తూటాలకు ధీటుగా తిరగబడ్డాయని, పోలీసుల బుల్లెట్లకు ప్రతిస్పందిస్తూ ఉద్యమకారులు చూపిన తెగువకు సమైక్య పాలకులు వెనుదిరుగక తప్పలేదని పేర్కోన్నారు.
మలిదశ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న వేళ.. మానుకోట ఘటన ఓ చారిత్రాత్మక సందర్భం. తెలంగాణ ఉద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఆ సంఘటన జరిగి నేటికి 14ఏళ్లు.
ఆధిపత్య అహంకారంతో తుపాకులు ఎక్కుపెట్టిన అప్పటి పాలకులకు మానుకోట రాళ్లే సమాధానం చెప్పాయి. తుపాకీ తూటాలకు దీటుగా… pic.twitter.com/niygts5ah7
— Harish Rao Thanneeru (@BRSHarish) May 28, 2024
తెలంగాణ ఉద్యమ ఉనికినే ప్రశ్నార్ధకంగా మార్చే ప్రయత్నాన్ని మానుకోట మట్టి సాక్షిగా ఉద్యమకారులు ఏకమై తిప్పి కొట్టారని, స్వరాష్ట్ర ఆకాంక్షను మరోసారి బలంగా చాటిచెప్పారన్నారు. ఈ క్రమంలో తుపాకీ తూటాలకు వెరవలేదు, లాఠీలకు భయపడలేదని, స్వరాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా ముందుకు కదిలి ఉద్యమానికి ఊపిరిలూదారని, ఆ చారిత్రక సన్నివేశాలు ఇంకా నా కళ్ళ ముందు కదలాడుతూనే ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. చరిత్రపుటల్లోనూ అవి చిరస్థాయిగా నిలిచిపోతాయని, భవిష్యత్ తరాలకు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని చాటుతాయని హరీశ్రావు పేర్కొన్నారు.