Hyderabad Metro | హైదరాబాద్లో 6.42కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ మెట్రో
హైదరాబాద్ నగరంలో తొలిసారిగా అండర్ గ్రౌండ్ మెట్రో రైలు మార్గం నిర్మించబోతున్నట్లుగా సమాచారం. శంషాబాద్ ఎయిర్ పోర్టు కాంపౌడ్ సరిహద్దు నుంచి టెర్మినల్ వరకు 6.42 కి.మీటర్లు అండర్ గ్రౌండ్లో మెట్రో నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

శంషాబాద్ ఎయిర్ పోర్టు కాంపౌడ్ సరిహద్దు నుంచి టెర్మినల్ వరకు
విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో తొలిసారిగా అండర్ గ్రౌండ్ మెట్రో రైలు మార్గం నిర్మించబోతున్నట్లుగా సమాచారం. శంషాబాద్ ఎయిర్ పోర్టు కాంపౌడ్ సరిహద్దు నుంచి టెర్మినల్ వరకు 6.42 కి.మీటర్లు అండర్ గ్రౌండ్లో మెట్రో నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇది నగరంలో మొదటి భూగర్భ మెట్రో రైలు మార్గం కానుంది. మెట్రో విస్తరణలో భాగంగా దీనిని డిజైన్ చేసినట్లుగా తెలుస్తుంది. శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు నిర్మించేందుకు ప్రతిపాదించిన మెట్రో మార్గంలో భూమి పై కొంతదూరం, భూగర్భంలో మరికొంత దూరం రైలు మార్గం నిర్మించేలా సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక లో పొందుపరిచారు.
ఇందులో మూడు స్టేషన్లు, కార్గో, టెర్మినల్, ఏరోసిటీ రాబోతున్నట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా ఇక్కడ డిపో నిర్మించాలని ప్రతిపాదించారు.రాయదుర్గం నుంచి నాగోల్ వరకు ప్రస్తుతం ఉన్న మెట్రో రైలు మార్గాన్ని ఇక నుంచి ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట, మైలార్దేవ్పల్లి, జల్పల్లి, పీ7 రోడ్, శంషాబాద్ విమానాశ్రయం వరకు 33.1 కి.మీ. వరకు విస్తరించేలా రెండో దశలో ప్రతిపాదించారు. ఇందులో నాగోల్ నుంచి లక్ష్మీగూడ వరకు 21.4 కి.మీ. ఆకాశమార్గం ఉంటుంది.
లక్ష్మీగూడ నుంచి పీ7 రోడ్డు ఎయిర్పోర్టు ప్రాంగణం సరిహద్దు వరకు 5.28 కి.మీ. అండర్ గ్రౌండ్ మార్గాన్ని అధికారులు ప్రతిపాదించారు. ఇక్కడ రహదారిపై డివైడర్ స్థలం చాలా విశాలంగా ఉండనుండగా, నిర్మాణ వ్యయం తగ్గేందుకు భూమార్గంలో మెట్రో నిర్మించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులకు సీఎం రేవంత్రెడ్డి సూచించారు. దీనిపై అధ్యయనం పిదప స్వల్పదూరం భూమార్గంలో తీసుకెళ్లేలా డీపీఆర్లో ప్రతిపాదించారు. విమానాశ్రయ కంపౌడ్ సరిహద్దు నుంచి టెర్మినల్ వరకు 6.42 కి.మీ. అండర్ గ్రౌండ్లో మెట్రో నిర్మించనున్నారు.