విధాత: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు లండన్ ఎన్నారై బీఆరెస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. లండన్ నగరంలోని టావిస్టాక్ స్క్వేర్ వద్ద తెలంగాణ అమరుల త్యాగాలను స్మరించుకుంటూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ వేడుకలకు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జి.జగదీశ్రెడ్డి హాజరై తెలంగాణ అమరులకు నివాళులర్పించారు.
తెలంగాణ రాష్ట్ర ఉద్యమ ప్రస్థానం..స్వరాష్ట్రంలో సాధించిన ప్రగతిని గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర సాధన ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ పురోగమనంలో పునరంకితం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో లండన్ బిఆరెస్ శాఖ ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి, అధికార ప్రతినిధులు రవి రేటినేని, రవి ప్రదీప్ పులుసు, లండన్ ఇంచార్జీ సురేష్ బుడగం, కోశాధికారి సతీశ్ గొట్టిముక్కుల, సెక్రటరీ సత్య చిలుముల , బోనగిరి నవీన్, ప్రశాంత్ మామిడాలు పాల్గొన్నారు.