విధాత : జగిత్యాల టూ టౌన్ ఎస్సై చంద్రశేఖ ఆత్మహత్యకు పాల్పడ్డారు. జమ్మికుంట మండలం సీతంపేటలోని అత్తారింట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఐదు రోజుల క్రితం ఆయన భార్య దివ్య గన్నేరు పప్పు తిని ఆత్మహత్య చేసుకుంది.
ఆ విషాద ఘటన మరువకముందేఎస్సై చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. కొద్ది రోజుల వ్యవధిలోనే భార్యాభర్తలిద్దరూ ఆత్మహత్య చేసుకోవడం రెండు కుటుంబాల్లోనూ తీరని శోకాన్ని మిగిల్చింది. భార్య లేదన్న మనస్తాపంతో చంద్రశేఖర్ ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తుంది.
