విద్యుత్ కొనుగోళ్లు, ప్రాజెక్ట్ ల నిర్మాణాలపై కేసీఆర్, జగదీశ్ రెడ్డి లు కోరితేనే విచారణ కమిషన్ వేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గురువారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలోనే మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి దమ్ముంటే విద్యుత్ కమిషన్ వేయాలని సవాల్ చేసిన విషయాన్ని తెలియజేశారు,
ఢిల్లీ: విద్యుత్ కొనుగోళ్లు, ప్రాజెక్ట్ ల నిర్మాణాలపై కేసీఆర్, జగదీశ్ రెడ్డి లు కోరితేనే విచారణ కమిషన్ వేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గురువారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలోనే మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి దమ్ముంటే విద్యుత్ కమిషన్ వేయాలని సవాల్ చేసిన విషయాన్ని తెలియజేశారు, వాళ్ల డిమాండ్ మేరకే విచారణ కమిషన్ వేశామని, విచారణ మొదలై నోటీస్ లు రాగానే కమిషన్ ఏర్పాటును తప్పు పడుతున్నారన్నారు. తాము సిట్టింగ్ జడ్జితో కమిషన్ ఏర్పాటు కోసం చీఫ్ జస్టీస్ కు లేఖ రాశామని, అయితే సిట్టింగ్ జడ్జిలను ఇవ్వలేమని చెప్పారని, దీంతో తాము రిటైర్డ్ జడ్జీతో కమిషన్ ఏర్పాటు చేశామని తెలిపారు. జస్టిస్ నరసింహా రెడ్డి విచారణ కమిషన్ వేయడం తప్పా..? అని ప్రశ్నించారు.
ఫిరాయింపులపై మాట్లాడే నైతికత కేసీఆర్ కు లేదు
పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతికత బీఆరెస్ అధినేత కేసీఆర్ కు లేదని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ “ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అంశాన్ని రాజకీయంగా ఉపయోగించు కోవాలని ప్రతిపక్షాలు చూశాయన్నారు.. మంత్రివర్గ విస్తరణ గురించి మీడియా ఎక్కువగా ప్రచారం చేస్తోందని, అన్ని శాఖలకు మంత్రులు ఉన్నారన్నారు. విద్యా శాఖ నా పరిధి లోనే ఉందని తెలిపారు. ఫిరాయింపులకు మాట్లాడే నైతికత కేసీఆర్ కు లేదన్నారు. ఎంతో మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లను తన పార్టీలో చేర్చుకున్న విషయం ఆయనకు గుర్తు లేదా..?” అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
నాకు ప్రత్యేక ఛాయిస్ అంటూ ఏదీ లేదు
పీసీసీ అధ్యక్షుడిగా తన పదవీ కాలం ముగిసిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ పార్టీ అధిష్టానం అధ్యక్షుడిగా ఎవరిని నియమించినా వారితో కలిసి పనిచేస్తానన్నారు. అధ్యక్షుడి నియామకంపై తన కంటూ ప్రత్యేక ఛాయిస్ ఏది లేదన్నారు.అధిష్టానం ఎవరిని నియమించినా వారితో కలిసి పనిచేయడమే తన బాధ్యత అని అన్నారు. తన పదవి కాలంలో రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చిందని, పార్లమెంటు ఎన్నికల్లో మంచి పనితీరు కనబరిచామన్నారు.