విధాత : పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్ర రెండో రోజు గురువారం సూర్యాపేట నుంచి వయా అర్వపల్లి, తిరుమలగిరి, జనగాం మీదుగా సాగుతూ భువనగిరికి చేరుకుంది. సాయంత్రం 6 గంటలకు భువనగిరిలో బీఆరెస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్కు మద్దతుగా నిర్వహించనున్న రోడ్డుషోలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. బస్సుయాత్ర షెడ్యూల్ అనుసరించి ఉదయం కేసీఆర్ రైతు సమస్యలను తెలుసుకున్నారు. సూర్యాపేట మండలం ఎర్కారం గ్రామం దుబ్బ తండాలో 5 ఎకరాలు ఎండిపోవడంతో ఆవేదన చెందిన రైతు ధరావత్ నర్సింహను కేసీఆర్ కలిశారు. ఆయన సమస్యలు విని ఆదుకుంటామని భరోసానిచ్చారు. మే నెల 10 వరకు ఈ బస్సు యాత్ర వరుసగా కొనసాగుతుంది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒకటి రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్షోలు ఉండే విధంగా బస్సు యాత్ర కొనసాగుతుంది.
భువనగిరికి కేసీఆర్ బస్సు యాత్ర.. రైతులకు పరామర్శ
పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్ర రెండో రోజు గురువారం సూర్యాపేట నుంచి వయా అర్వపల్లి, తిరుమలగిరి, జనగాం మీదుగా సాగుతూ భువనగిరికి చేరుకుంది

Latest News
Bomb Scare | విమానంలో బాంబ్ టెన్షన్.. 16 ఏళ్ల బాలుడి ఆకతాయి పనితో.. గంటల పాటు హైడ్రామా!
Honeymoon Tragedy | పెళ్లయిన గంటల్లోనే విషాదం.. హనీమూన్కు వెళ్తుండగా కుప్పకూలిన హెలికాప్టర్.. భారత సంతతి వరుడు మృతి
Switzerland | భారతీయ పర్యాటకురాలికి స్విట్జర్లాండ్ పోలీసుల షాక్.. టూర్కు వెళ్లొచ్చిన ఏడాదికి రూ.1.5లక్షల ఫైన్ చెల్లించాలని నోటీసులు!
Murder Mystery | కొడుకు కనబడట్లేదని హైకోర్టు మెట్లు ఎక్కిన తల్లి.. సిట్ విచారణలో దృశ్యం మూవీని మించిన ట్విస్టులు!
సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా… ‘పోలీస్ కంప్లైంట్’ ట్రైలర్, స్పెషల్ సాంగ్స్ లాంచ్
జూన్ 12న ప్రేక్షకుల ముందుకు ‘కొత్త మలుపు’
ఓట్లు అడిగే హక్కు బీఆర్ఎస్ కు లేదు: ఎమ్మెల్యేలు యెన్నం, అనిరుధ్
సింధూ లోయ పశుపతి ముద్రపై కొత్త రచ్చ !
కాక్రోచ్ జనతా పార్టీ తొలి టార్గెట్ ధర్మేంధ్ర ప్రధాన్ .. ధర్నాకు పిలుపు
జేబుదొంగలు ఉన్నారు జాగ్రత్త: రాహుల్ గాంధీ హెచ్చరిక