భువనగిరికి కేసీఆర్ బస్సు యాత్ర.. రైతులకు పరామర్శ

పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్ర రెండో రోజు గురువారం సూర్యాపేట నుంచి వయా అర్వపల్లి, తిరుమలగిరి, జనగాం మీదుగా సాగుతూ భువనగిరికి చేరుకుంది

  • Publish Date - April 25, 2024 / 06:11 PM IST

విధాత : పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్ర రెండో రోజు గురువారం సూర్యాపేట నుంచి వయా అర్వపల్లి, తిరుమలగిరి, జనగాం మీదుగా సాగుతూ భువనగిరికి చేరుకుంది. సాయంత్రం 6 గంటలకు భువనగిరిలో బీఆరెస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్‌కు మద్దతుగా నిర్వహించనున్న రోడ్డుషోలో కేసీఆర్ ప్రసంగించనున్నారు. బస్సుయాత్ర షెడ్యూల్ అనుసరించి ఉదయం కేసీఆర్ రైతు సమస్యలను తెలుసుకున్నారు. సూర్యాపేట మండలం ఎర్కారం గ్రామం దుబ్బ తండాలో 5 ఎకరాలు ఎండిపోవడంతో ఆవేదన చెందిన రైతు ధరావత్ నర్సింహను కేసీఆర్ కలిశారు. ఆయన సమస్యలు విని ఆదుకుంటామని భరోసానిచ్చారు. మే నెల 10 వరకు ఈ బస్సు యాత్ర వరుసగా కొనసాగుతుంది. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఒకటి రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్‌షోలు ఉండే విధంగా బస్సు యాత్ర కొనసాగుతుంది.

Latest News