Minister Komatireddy | కేంద్రంలో వచ్చేది ఇండియా కూటమినే: మంత్రి కోమటిరెడ్డి

పార్లమెంటు ఎన్నికల అనంతరం ఇండియా కూటమినే కేంద్రంలో అధికారంలోకి రాబోతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోస్యం చెప్పారు.

  • Publish Date - May 23, 2024 / 01:46 PM IST

పార్లమెంటు ఎన్నికల తర్వాత బీఆరెస్ భూ స్థాపితమే
పేదల కోసమే సన్నలకు బోనస్‌
కవిత కేసుతో రాష్ట్రం పరువు పోయింది
కేసీఆర్ కుటుంబం బెయిల్ కోసం ప్రయత్నించాలి
కొత్త దుకాణం పెట్టుకునే ఆలోచనలో హరీశ్‌రావు
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాట్ కామెంట్స్‌

విధాత: పార్లమెంటు ఎన్నికల అనంతరం ఇండియా కూటమినే కేంద్రంలో అధికారంలోకి రాబోతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోస్యం చెప్పారు. గురువారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆరెస్ భూస్థాపితమవుతుందన్నారు. తెలంగాణలో 12 ఎంపీ సీట్లు తగ్గకుండా మాకు వస్తాయని, బీఆరెస్‌కు రెండు, మూడు చోట్ల డిపాజిట్ వస్తే ఎక్కువన్నారు. జూన్ 5 తర్వాత బీఆరెస్‌ నేతలు అంతా కేఏ పాల్‌లా తిరగాల్సిందేనన్నారు.

కవిత జైలుకు వెళ్లిందని, ప్రభుత్వం పోయిందనే ఫ్రస్టేషన్ లో కేటీఆర్ ఉన్నారని, సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ విమర్శలు అసహ్యంగా ఉన్నాయని మండిపడ్డారు. మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించినందుకు,30 వేల ఉద్యో నియామకాలు చేపట్టినందుకా రేవంత్ రెడ్డిని కేటీఆర్ తిడుతున్నాడని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న మీద కేసులు ఉన్నాయంటున్నకేటీఆర్.. కవిత కేసు గురించి ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు.

కవిత చేసిన పనికి తెలంగాణ ప్రజలు తలెత్తుకోలేకపోతున్నారని,..మేము ఇతర రాష్ట్రాలకు వెళ్లలేకపోతున్నామన్నారు. టెట్ కు 2 వేలు పెడితే మమ్మల్ని కేటీఆర్ విమర్శిస్తున్నాడని, వైన్ షాపుల పేరు మీద దరఖాస్తు ఫీజులు పెంచి 2500 కోట్లు గత ప్రభుత్వం రాబట్టిందని..బీఆరెస్‌ హాయాంలో మద్యం అమ్మకాలు పెరిగాయి తప్ప అభివృద్ధి జరగలేదన్నారు. రేవంత్ రెడ్డి కి బయపడి కేసీఆర్ అసెంబ్లీ కి రావడం లేదని, వైఎస్సార్ తరహాలో రేవంత్ రెడ్డి కూడా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని చెప్పారు.

బీఆరెస్ హయాంలో ఎటువంటి పర్మిషన్ లేకుండానే బీఆరెస్ పార్టీ ఆఫీసులు కట్టారని, వాటిపై చర్యలు తీసుకుంటామన్నారు. బీఆరెస్ ఎల్పీ బాధ్యత కేటీఆర్‌కు ఇస్తే హరీష్ రావు కొత్త దుకాణం పెట్టే ఆలోచనలో ఉన్నారటని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆరెస్ హయంలో వివిధ రంగాల్లో చేసిన అవినీతి, అక్రమాలకు సంబంధించి కేసీఆర్ కుటుంబం ఇక బెయిల్ కోసం ప్రయత్నం చేస్తే బెటర్ అని వెంకట్‌రెడ్డి హితవు చెప్పారు. ఐఏఎస్ లను అందరినీ అందరిని పక్కన పెట్టి నలుగురు ఐఎఎస్ లను కేటీఆర్ ఎంకరేజ్ చేశారని, ఉద్యమకారుడు కేకే మహెందర్ రెడ్డి ని బీఆరెస్‌ నుంచి వెళ్లగొట్టిందే కేటీఆర్ అని విమర్శించారు.

పేదల కోసమే సన్నలకు బోనస్‌

పేదలకు సన్న బియ్యం ఇవ్వాలని సన్నాలకు బోనస్ ఇస్తామని చెప్పామని చెప్పామని, దోడ్డు వడ్లకు బోనస్‌ ఇవ్వమని మేము ఎక్కడా చెప్పలేదని వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే నెల 6,7,8తేదీల్లో నేను, శ్రీధర్ బాబు విదేశీ పర్యటనకు వెలుతున్నామని, వివిధ కంపెనీలతో భేటీ అవుతామని చెప్పారు. గతంలో తెలంగాణకు పలు పరిశ్రమలు తెచ్చింది కాంగ్రెస్‌ ప్రభుత్వాలేనన్నారు. దుర్గం చెరువుపై కేబుల్‌ బ్రిడ్జీ కట్టి అబివృద్ది చేశామని కేటీఆర్‌ చెప్తున్నారని, ఎయిర్‌ పోర్టు , పీవి ఎక్స్ ప్రెస్ వే లాంటివి కట్టిన మేం ఎంత చెప్పుకోవాలన్నారు.

బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డిపైన, ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఏలేటి సీనియర్ నేత రాజాసింగ్‌ను కాదని బీజేఎల్పీ పదవి తీసుకున్నాడని, ఆయన పేరు చెప్పాలంటేనే నాకు నామోషిగా ఉందన్నారు. బీజేపీ ఫ్లోర్‌ లీడరై నెల రోజులు కాని ఏలేటి ఆర్టీఐ కింద 70 లెటర్ లు పెట్టాడని దుయ్యబట్టారు. ఎల్బీనగర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని 14 అంతస్థులకు కుదిస్తామని వెంకట్‌రెడ్డి వెల్లడించారు.

Latest News