నల్లగొండ, విధాత: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలు చోట్ల ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా
వలిగొండ మార్కెట్ యార్డ్లో రైతులు నిల్వ చేసుకున్న ధాన్యం తడిసిపోయింది, కాళ్లాల్లోని వడ్లు వర్షం దాటికి కొట్టుక పోయాయి. ఆరుగాలం కష్టపడి పండించిన వడ్లు వర్షానికి కొట్టుకుపోవడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. చౌటుప్పల్, నారాయణపురం, రామన్నపేట మండలాల్లో వర్షం దంచికొట్టడంతో ఐకేపీ కేంద్రాల్లో, రైతన్నలు ఆరబోసుకున్న వడ్లు కొట్టుకుపోయాయి. ఐకేపీ కేంద్రాల్లో నెలరోజులుగా ఆరబోసినా అధికారులు కాంటా పెట్టకపోవడంతో తమ ధాన్యం నీటిపాలు అయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కక్కిరేని, దుబ్బాక, ఎన్నారం, ఇస్మిల్లా, లక్ష్మపురం గ్రామాలలోని ఒక్కో ఐకేపీ సెంటర్స్ లో 100 లారీలకు పైగా ధాన్యం తడిసినట్లు సమాచారం.
Nalgonda : అకాల వర్షం.. ఐకేపీ కేంద్రాల్లో కొట్టుకుపోయిన ధాన్యం
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భారీ అకాల వర్షం. వలిగొండ మార్కెట్ యార్డుతో పాటు ఐకేపీ కేంద్రాల్లోని రైతుల ధాన్యం తడిసి కొట్టుకుపోయింది. రైతుల ఆవేదన.
