దాసి సుదర్శన్ గా పిలువబడే సీనియర్ పాత్రికేయులు ప్రముఖ చిత్రకారుడు జాతీయ నంది అవార్డు గ్రహీత సుదర్శన్ (72) సోమవారం మధ్యాహ్నం గుండెపోటుతో మిర్యాలగూడలో పరమపదించారు
దాసి సుదర్శన్ గా పిలువబడే సీనియర్ పాత్రికేయులు ప్రముఖ చిత్రకారుడు జాతీయ నంది అవార్డు గ్రహీత సుదర్శన్ (72) సోమవారం మధ్యాహ్నం గుండెపోటుతో మిర్యాలగూడలో పరమపదించారు
విధాత : దాసి సుదర్శన్ గా పిలువబడే సీనియర్ పాత్రికేయులు ప్రముఖ చిత్రకారుడు జాతీయ నంది అవార్డు గ్రహీత సుదర్శన్ (72) సోమవారం మధ్యాహ్నం గుండెపోటుతో మిర్యాలగూడలో పరమపదించారు. ప్రముఖ చిత్రకారుడు గా, సాహితీవేత్తగా సురపరిచితులైన సుదర్శన్ నాగార్జునసాగర్ జూనియర్ కాలేజ్ లో డ్రాయింగ్ మాస్టర్ గా పనిచేస్తూ, ఎంతోమంది విద్యార్థులను కళల వైపు, సాహిత్యం వైపు మళ్లించి నిష్ణాతులను చేశారు. ఆర్టిస్టుగా, సాహితీవేత్తగానే కాకుండానే కాకుండా ఆయన జర్నలిస్టుగా కూడా వివిధ పత్రిక ల్లో వ్యాసాలు, వార్తలు రాస్తూ ప్రజ్ఞ పాటవాలు చాటారు. సినిమా రంగానికి కూడా ఆయన సుపరిచితులే. ప్రముఖ దర్శకులు కళాకారులు బి. నర్సింగరావు తీసిన అనేక సినిమాలకు ఆయన కళాదర్శకుడిగా, కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేశారు.
నర్సింగరావు తీసిన దాసి సినిమాకు అందుకున్న ఐదు జాతీయ అవార్డులలో సుదర్శన్ కాస్ట్యూమ్ డిజైనర్ గా జాతీయ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత జాతీయ అవార్డుల జ్యూరీ సభ్యులుగా నియమితులయ్యారు. ఇలా అనేక రంగాలలో ప్రతిభాపాటవాలు ప్రదర్శించిన సుదర్శన్ తన 72 ఏటా తనువు చాలించారు. ఆయన మృతి అభిమానులకు ,శిష్యులకి సాహితి మిత్రులందరికీ విషాదాన్ని మిగిల్చింది. నాగార్జునసాగర్లో నివాసము ఉన్న గత కొంతకాలంగా అనారోగ్య కారణాలతో హైదరాబాద్ ,మిర్యాలగూడలో ఉంటూ సోమవారం మిర్యాలగూడలో గుండెపోటుతో మృతి చెందడంతో సాగర్ లోని ఆయన అభిమానులు,, కళాకారులు, జర్నలిస్టులు ఘనంగా నివాళులర్పించారు.