ఉద్దెర తప్ప ఈ వంద రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్ధరించిందేమీలేదని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు విమర్శించారు.
ఉద్దెర తప్ప ఈ వంద రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్ధరించిందేమీలేదని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు విమర్శించారు.
కడియం శ్రీహరి పార్టీకి ద్రోహం చేశారు
ఎన్నికల్లో విజయం ద్వార బుద్ది చెప్పాలి
మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు
విధాత, వరంగల్ ప్రతినిధి: ఉద్దెర తప్ప ఈ వంద రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్ధరించిందేమీలేదని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు విమర్శించారు. హనుమకొండలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ అధ్యక్షతన సోమవారం జరిగిన వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ విస్తృత సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వంద రోజుల్లో ఆరుగ్యారంటీలు, 13 హామీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ అమలు చేయకుండా ఉద్దేర బేరం చేస్తుందంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ బాండ్ పేపర్ పాలనలో ఉద్దరించుడు మాట దేవుడెరుగు కానీ, అన్నీ ఉద్దెర మాటలే చెప్తున్నారని విమర్శించారు. ప్రతి నెల రూ. 2,500 లు డిసెంబర్ నెల నుండి ఇస్తా అన్న హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని, కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కరువు వచ్చింది. కరెంట్ మోటార్లు కాలిపోతున్నయని ఆరోపించారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే మోసపోతాం. 2 లక్షల రూపాయల రుణమాఫీ, 4,000 పెన్షన్, తులం బంగారం ఇవ్వకపోయినా ప్రజలు అంగీకరించారు అంటారు. కాబట్టి, కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలి. దీనిపైన ప్రతి గ్రామంలో చర్చ జరగాలని కోరారు.
కడియం పార్టీకి ద్రోహం
ఎమ్మెల్యే కడియం శ్రీహరి పార్టీకి తీరని ద్రోహం చేశారని హరీష్ రావు విమర్శించారు. పార్టీలోకి వచ్చిన కొద్దికాలంలోనే అన్ని రకాల పదవులు అనుభవించారని విమర్శించారు. పార్టీ టికెట్ ఇచ్చిన తర్వాత ద్రోహం చేయడం క్షమించరాదన్నారు. రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. రాబోయే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. మాటలు కాకుండా చేతల్లో చూపెట్టాలని పిలుపు నిచ్చారు. మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ ఎందరో త్యాగాలు చేస్తే కడియం అనేక పదవులు అనుభవించారని అన్నారు. ఈ పార్టీలో ఉన్న అక్కడి వారిని అణగదొక్కితాను అధికారం చెలాయించడం కడియానికి అలవాటని మండిపడ్డారు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం చెప్పే ఆదర్శమిదేనా? అంటూ ప్రశ్నించారు.
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీకి పునాదిలాంటి కార్యకర్తలంటే కడియానికి చులకన అంటూ విమర్శించారు. ఉద్యమకాలమంతా కష్టాలు కన్నీళ్ళు మేము అనుభవిస్తే పార్టీలోకి వచ్చి అన్ని రకాల పదవులు అనుభవించిన వ్యక్తి శ్రీహరి అంటూ విమర్శించారు. పైగా నీతులు చెప్పడం ఆయనకు అలవాటంటూ ఎద్దేవా చేశారు. నాగుపాము లాంటి వ్యక్తి అంటూ అభివర్ణించారు. ఈ సమావేశంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ధర్మారెడ్డి, నన్నపునేని, గండ్ర తదితరులు ప్రసంగించారు. ఈ సమావేశంలో రానున్న ఎన్నికల్లో పోటీపెట్టే అభ్యర్ధిపై నాయకులు, కార్యకర్తలు తమ అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు.