Ponguleti Srinivas Reddy | ప్రతిపక్ష నేత కేసిఆర్ కు కనువిప్పు కలిగే బడ్జెట్ … మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ప్రజాపాలనకు, ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా రాష్ట్ర బడ్జెట్ ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రకటించిన హామీలను ముఖ్యంగా ఆరు గ్యారెంటీలను అమలు చేసే విధంగా బడ్జెట్ రూపొందించి నిధులు కేటాయించడం జరిగిందన్నారు

Ponguleti Srinivas Reddy | ప్రతిపక్ష నేత కేసిఆర్ కు కనువిప్పు కలిగే బడ్జెట్ … మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్: ప్రజాపాలనకు, ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా రాష్ట్ర బడ్జెట్ ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రకటించిన హామీలను ముఖ్యంగా ఆరు గ్యారెంటీలను అమలు చేసే విధంగా బడ్జెట్ రూపొందించి నిధులు కేటాయించడం జరిగిందన్నారు. బడ్జెట్ ను చీల్చి చెండాడుతామని ప్రతిపక్ష నేత కేసిఆర్ చేసిన వ్యాఖ్యలను మంత్రి శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ బడ్జెట్ గత పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ కు ఒక కనువిప్పు వంటిదన్నారు. తొలిసారి అసెంబ్లీ సమావేశాలకు హాజరు అయిన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఈ బడ్జెట్ ను విమర్శించడానికి కూడా ఏమి లేదన్నారు. మొదటిసారి వచ్చారు కాబట్టి, ఏదో ఒకటి మాట్లాడాలని తన సహజ ధోరణిలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. ఈ రాష్ట్రాన్ని వారు ఆర్థికంగా ఎంతో చిన్నాభిన్నం చేసి, తెలంగాణ సమాజం కోలుకోలేని దెబ్బ తీశారన్నారు. ముఖ్యమంత్రిగా చీల్చి చెండాడి ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేశారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు మళ్ళీ అదే ధోరణిలో మాట్లాడడంలో ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు ఎనిమిది నెలల క్రితమే చీల్చి చెండాడి కేసీఆర్‌ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని వ్యంగ్యాస్త్రాలు వేశారు. ఎన్నో అక్రమాలతో అవినీతితో ఖాళీ ఖజానాను మా ప్రభుత్వానికి అప్పగించారని, ఎంతో సమర్థవంతంగా ప్రజాభిష్టానికి అనుగుణంగా ప్రతిపక్షంలోని కొంతమంది పెద్దలు నోరు మెదపడానికి కూడా రాని విధంగా బడ్జెట్ ను ప్రవేశ పెడితే ఇటువంటి ప్రజారంజక బడ్జెట్ ను చీల్చి చెండాడుతారా అని మండిపడ్డారు.