ఈ ఏడాది యధావిధిగా ఇంటర్ అడ్మిషన్లు : సీఎం రేవంత్ రెడ్డి

ఇంటర్ అడ్మిషన్లు ఈ విద్యాసంవత్సరం యధావిధిగా కొనసాగుతాయని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం పాఠశాల విద్యలో ఇంటర్ విలీనంపై అధికారులు, నిపుణులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

విధాత, హైదరాబాద్ : ఇంటర్ అడ్మిషన్లు ఈ విద్యాసంవత్సరం యధావిధిగా కొనసాగుతాయని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం పాఠశాల విద్యలో ఇంటర్ విలీనంపై అధికారులు, నిపుణులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది యధావిధిగా ఇంట‌ర్మీడియ‌ట్ ప్ర‌వేశాలు చేప‌ట్టాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.విలీనంపై శాసనసభలో చర్చ తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని రేవంత్ వెల్లడించారు. ప్ర‌వేశాల‌కు స‌మ‌యం త‌క్కువ‌గా ఉండ‌డం, ఇంట‌ర్మీడియ‌ట్‌ను పాఠ‌శాల విద్య‌లో విలీనం చేసే ప్ర‌క్రియ‌కు ప‌లు సాంకేతిక స‌మ‌స్య‌లు అడ్డుగా ఉండ‌డంతో విద్యార్థుల ప్ర‌యోజనాల‌కు భంగం వాటిల్ల‌కుండా వెంట‌నే ప్ర‌వేశాల ప్ర‌క్రియ‌ను చేప‌ట్టాల‌ని సీఎం సూచించారు. ఇంట‌ర్మీడియ‌ట్ ను ర‌ద్దు చేసి సీబీఎస్ఈలో మాదిరే 11, 12 త‌ర‌గ‌తులు నిర్వ‌హించాల‌ని.. ఫ‌లితంగా డ్రాపౌవుట్స్ సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గుతుంద‌ని తెలంగాణ ఎడ్యుకేష‌న్ క‌మిష‌న్ రాష్ట్ర ప్ర‌భుత్వానికి సూచించింది.

సీబీఎస్ఈతో పాటు మెజారిటీ రాష్ట్రాలు 11, 12 త‌ర‌గ‌తుల విధానాన్ని అనుస‌రిస్తున్నాయి. మ‌న రాష్ట్రంలో మాత్రం ఇంట‌ర్మీడియ‌ట్ విద్య వేరుగా ఉంది. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు చ‌దివిన విద్యార్థుల్లో అత్య‌ధికులు ఆ త‌ర్వాత ఇంట‌ర్మీడియ‌ట్‌కు వేరుగా ఉన్న క‌ళాశాల‌ల్లో చేర‌డం లేదు. అప్ప‌టితో విద్య‌ను నిలిపివేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఇంట‌ర్మీడియ‌ట్‌ను వేరుగా కాకుండా 11, 12 త‌ర‌గ‌తులుగా కొన‌సాగించాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి గ‌తంలో అధికారుల‌కు సూచించారు. ఇదే అంశాన్ని తెలంగాణ ఎడ్యుకేష‌న్ క‌మిష‌న్ సైతం త‌న నివేదిక‌లో పేర్కొంది. ఇటీవ‌ల ఇంట‌ర్మీడియ‌ట్‌లో ప్ర‌వేశాలు నిలిపివేస్తూ అధికారులు ప్ర‌క‌ట‌న విడుదల చేయ‌డంతో విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రుల నుంచి ఆందోళ‌న వ్య‌క్త‌మైంది.

ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి, ఎంపీ వేం న‌రేంద‌ర్ రెడ్డి, రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణారావు, సీఎం ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ శేషాద్రి, సీఎం స్పెష‌ల్ సెక్ర‌ట‌రీ అజిత్ రెడ్డి, సీఎం సెక్ర‌ట‌రీ మాణిక్ రాజ్‌, విద్యా శాఖ క‌మిష‌న‌ర్ యోగితా రాణాల‌తో చ‌ర్చించారు. విలీనంతో ముడిప‌డిన ప‌లు సాంకేతిక స‌మ‌స్య‌లను క్షుణ్నంగా అధ్య‌య‌నం చేయాల్సి ఉన్నందున ఈ ప్ర‌క్రియ‌ను తాత్కాలికంగా వాయిదా వేయాల‌ని నిర్ణ‌యించారు.

విలీన‌ ప్ర‌క్రియ‌కు సంబంధించి భాగ‌స్వాముల‌తో విస్తృతంగా సంప్ర‌దింపులు నిర్వ‌హించాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ఈ అంశంపై తెలంగాణ ఎడ్యుకేష‌న్ పాల‌సీపై నియ‌మించిన క‌మిటీ అధ్య‌య‌నం చేసి త‌న నివేదిక స‌మ‌ర్పించాల‌ని సీఎం సూచించారు. అనంత‌రం శాస‌న‌స‌భ‌లో చ‌ర్చించి తుది నిర్ణ‌యం తీసుకుందామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

Latest News